Share News

గ్రూప్‌-1 అభ్యర్థులకు న్యాయం చేయండి: షర్మిల

ABN , Publish Date - Aug 19 , 2024 | 05:32 AM

గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ రాసిన అభ్యర్థులకు న్యాయం చేయాలని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల కోరారు. గ్రూప్‌-2 డిప్యూటీ డీఈవో పోస్టుల ఎంపికలో అనుసరిస్తున్నట్లుగానే..

 గ్రూప్‌-1 అభ్యర్థులకు న్యాయం చేయండి: షర్మిల

అమరావతి, ఆగస్టు 18(ఆంధ్రజ్యోతి): గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ రాసిన అభ్యర్థులకు న్యాయం చేయాలని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల కోరారు. గ్రూప్‌-2 డిప్యూటీ డీఈవో పోస్టుల ఎంపికలో అనుసరిస్తున్నట్లుగానే.. గ్రూప్‌-1లోనూ 1:100 విధానాన్ని అనుసరించాలని ఆదివారం ఎక్స్‌ వేదికగా ఆమె ముఖ్యమంత్రి చంద్రబాబును అభ్యర్థించారు. గ్రూప్‌-2, గ్రూప్‌-1 పరీక్షలకు సమయం తక్కువగా ఉందని, కొత్త సిలబస్‌ అంటూ పాత సిలబ్‌సలోనే పరీక్షలు నిర్వహించడంతో అభ్యర్థులు తీవ్ర మనోవేదనకు గురయ్యారని తెలిపారు. అభ్యర్థుల జీవితాలకు సంబంధించిన అంశమైనందున సానుభూతితో పరిశీలించి న్యాయం చేయాలని చంద్రబాబును కోరారు.

Updated Date - Aug 19 , 2024 | 05:34 AM