Share News

Hyderabad: బీఆర్‌ఎస్‌ నాయకురాలి ఆత్మహత్య.. కారణం ఏంటంటే..

ABN , Publish Date - Jun 30 , 2024 | 10:34 AM

ఆర్థిక ఇబ్బందుల కారణంగా బీఆర్‌ఎస్‌(BRS) నాయకురాలు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన లాలాగూడ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది. లాలాపేట్‌ సాయినగర్‌(Lalapet Sainagar)కు చెందిన సైదులు భార్య మాధురి అలియాస్‌ పప్పి బీఆర్‌ఎస్‌ పార్టీలో మహిళా కార్యకర్తగా చురుగ్గా పనిచేస్తున్న ఈమెకు పెళ్లై తొమ్మిదేళ్లు అవుతున్నా ఇంతవరకు పిల్లలు లేరు.

Hyderabad: బీఆర్‌ఎస్‌ నాయకురాలి ఆత్మహత్య.. కారణం ఏంటంటే..

- ఏమండీ.. నేను చేసిన అప్పులు కట్టుకో అంటూ..

- భర్తకు ఫోన్‌ చేసి ఆత్మహత్య చేసుకున్న భార్య

హైదరాబాద్: ఆర్థిక ఇబ్బందుల కారణంగా బీఆర్‌ఎస్‌(BRS) నాయకురాలు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన లాలాగూడ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది. లాలాపేట్‌ సాయినగర్‌(Lalapet Sainagar)కు చెందిన సైదులు భార్య మాధురి అలియాస్‌ పప్పి బీఆర్‌ఎస్‌ పార్టీలో మహిళా కార్యకర్తగా చురుగ్గా పనిచేస్తున్న ఈమెకు పెళ్లై తొమ్మిదేళ్లు అవుతున్నా ఇంతవరకు పిల్లలు లేరు. పీకల దాక అప్పులు కావడంతో శనివారం రాత్రి ఇంట్లో ఫాన్‌కు ఉరేసుకునే ముందు తన భర్తకు ఫోన్‌ చేసి ఏమండీ ... అప్పులు చేశా కట్టుకో, నేను ఉరివేసుకుంటాననని ఫోన్‌ చేయడంతో అప్పటికప్పుడు భర్త ఇంటిపక్కన వాళ్లకు సమాచారం ఇచ్చాడు.

ఇదికూడా చదవండి: Rachakonda CP: రేపటి నుంచి అమల్లోకి కొత్తచట్టాలు..


city3.jpg

ఓ మహిళ తలుపు తీసి చూసేసరికి పప్పి ఫ్యాన్‌కు ఉరేసుకుని అప్పటికే ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న లాలాగూడ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరలించారు.


ఇదికూడా చదవండి: Hyderabad: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - Jun 30 , 2024 | 10:34 AM