Share News

Hyderabad: ప్రాణాలు తీసిన అతివేగం.. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకుల దుర్మరణం

ABN , Publish Date - Jun 16 , 2024 | 10:31 AM

జాతీయ రహదారి పక్కన ఆగి ఉన్న డీసీఎం(DCM)ను అతివేగంగా వచ్చిన స్కూటీ ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. ఈ సంఘటన కూకట్‌పల్లి(Kukatpally)లో జరిగింది.

Hyderabad: ప్రాణాలు తీసిన అతివేగం.. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకుల దుర్మరణం

హైదరాబాద్: జాతీయ రహదారి పక్కన ఆగి ఉన్న డీసీఎం(DCM)ను అతివేగంగా వచ్చిన స్కూటీ ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. ఈ సంఘటన కూకట్‌పల్లి(Kukatpally)లో జరిగింది. ఇన్‌స్పెక్టర్‌ కృష్ణమోహన్‌ తెలిపిన వివరాల ప్రకారం.. కుత్బుల్లాపూర్‌ సురారం సమీపంలోని భవానీనగర్‌కు చెందిన ఉదయ్‌కుమార్‌(18), సాయిబాబానగర్‌కు చెందిన సోను(20), మల్లారెడ్డినగర్‌కు చెందిన షఫీ(17) ముగ్గురు స్నేహితులు. వీరు శుక్రవారం అర్ధరాత్రి 2గంటల సమయంలో స్కూటీపై కూకట్‌పల్లికి వచ్చారు.

ఇదికూడా చదవండి: Hyderabad: విమానాల్లో నగల చోరీలు.. వృద్ధ, మధ్య వయస్కులైన మహిళలే టార్గెట్‌


city1.jpg

కేపీహెచ్‌బీ కాలనీ(KPHB Colony) వైపు అతివేగంగా వెళ్తుండగా కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్‌కు సమీపంలోకి రాగానే స్కూటీ అదుపుతప్పి రహదారి పక్కన ఆగి ఉన్న డీసీఎం(హెచ్‌ఆర్‌38ఏఎఫ్ 6203)ను వెనుకవైపు నుంచి ఢీ కొట్టింది. దీంతో డ్రైవింగ్‌ చేస్తున్న ఉదయ్‌కుమార్‌తోపాటు సోను, షఫీ కింద పడిపోయారు. తీవ్రగాయాలైన ఉదయ్‌కుమార్‌, సోను అక్కడికక్కడే మృతి చెందగా.. షఫీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ర్యాష్‌ డ్రైవింగ్‌ చేయడంతోనే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు సీసీ కెమెరాల ద్వారా గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్‌ తెలిపారు.


ఇదికూడా చదవండి: Hyderabad: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - Jun 16 , 2024 | 10:31 AM