Share News

Uttar Pradesh: బైక్‌పై వెళుతోన్న జంటపై ఇలా..

ABN , Publish Date - Aug 01 , 2024 | 12:09 PM

ఉత్తరప్రదేశ్‌లో ఓ జంటపై ఆకతాయిల అసభ్యంగా ప్రవర్తించారు. వర్షం పడుతోన్న సమయంలో కూడా తీరు మార్చుకోలేదు. బ్రిడ్జీ మీద బైక్‌పై వెళుతోన్న ఓ జంటపై రెచ్చిపోయారు.

Uttar Pradesh: బైక్‌పై వెళుతోన్న జంటపై ఇలా..
Uttar Pradesh Mob Harassing Woman

లక్నో: కొందరు అస్సలు మారడం లేదు. తమ వెకిలి చేష్టలతో రెచ్చిపోతున్నారు. ఏ సందర్భంలో అయినా సరే అలానే ప్రవర్తిస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లో (Uttar Pradesh) ఓ జంటపై ఆకతాయిల అసభ్యంగా ప్రవర్తించారు. వర్షం పడుతోన్న సమయంలో కూడా తీరు మార్చుకోలేదు. బ్రిడ్జీ మీద బైక్‌పై వెళుతోన్న ఓ జంటపై రెచ్చిపోయారు.


ఏం జరిగిందంటే..?

అప్పటికే కాస్త వర్షం పడుతోంది. అయినప్పటికీ ధైర్యం చేసి.. తాజ్ హోటల్ వద్ద గల బ్రిడ్జీ మీద ఓ జంట బైక్ మీద వెళుతోంది. బ్రిడ్జీ మీద నీళ్లు నిలిచిపోయి ఉన్నాయి. ఆ సమయంలో 20 మంది ఆకతాయిలు కాసుకొని ఉన్నారు. బైక్ మీద జంట వచ్చేసరికి రెచ్చిపోయారు. బైక్ దగ్గరికి వచ్చేసరికి వర్షపు నీటిని వారిపై చల్లారు. అరుస్తూ, ఈలలు వేస్తూ నానా హంగామా చేశారు.

mob-2.jpg


బైక్ దగ్గరికి రాగా..

ఆ జంట బైక్ వారి దగ్గరికి రాగా మరింత రెచ్చిపోయారు. కొందరు బైక్ పట్టుకొని కిందకి లాగారు. దాంతో ఆ జంట కిందపడిపోయారు. ఆ తర్వాత ఇద్దరూ లేచారు. సదరు మహిళ బైక్ మీద నుంచి కింద పడిపోయే ముందు ఒకడు మహిళను పట్టుకున్నట్టు తెలుస్తోంది. జంటను వేధిస్తున్నారని విషయం తెలుసుకున్న పోలీసులు బ్రిడ్జీ మీదకు వచ్చారు. జంటను అల్లరి చేస్తోన్న యువతను చెదరగొట్టారు. వారి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వారిని గుర్తించే పనిలో ఉన్నారు. త్వరలో అరెస్ట్ చేస్తామని ప్రకటన చేశారు.


Read More National News
and Latest Telugu News

Updated Date - Aug 01 , 2024 | 12:09 PM