Share News

Lovers: ప్రియురాలు పిలిచిందని రయ్‌మని వెళ్లాడు.. కట్ చేస్తే మైండ్ బ్లాంక్ ట్విస్ట్..

ABN , Publish Date - Jul 06 , 2024 | 11:23 AM

ప్రియురాలు పిలిచిందని.. ఆమె ఇంటికి వెళ్లిన ప్రియుడికి బిగ్ షాక్ తగిలింది. వారిద్దరూ ఏకాంతంగా ఉండగా.. ప్రియురాలి కుటుంబ సభ్యులు రెడ్ హ్యాడెండ్‌గా పెట్టుకున్నారు. దీంతో ప్రేమికులిద్దరికీ బిగ్ షాక్ తగిలింది. మరి పట్టుకున్న కుటుంబ సభ్యులు వారిద్దరినీ ఏం చేశారు?

Lovers: ప్రియురాలు పిలిచిందని రయ్‌మని వెళ్లాడు.. కట్ చేస్తే మైండ్ బ్లాంక్ ట్విస్ట్..
Relationship

పాట్నా, జులై 06: ప్రియురాలు పిలిచిందని.. ఆమె ఇంటికి వెళ్లిన ప్రియుడికి బిగ్ షాక్ తగిలింది. వారిద్దరూ ఏకాంతంగా ఉండగా.. ప్రియురాలి కుటుంబ సభ్యులు రెడ్ హ్యాడెండ్‌గా పెట్టుకున్నారు. దీంతో ప్రేమికులిద్దరికీ బిగ్ షాక్ తగిలింది. మరి పట్టుకున్న కుటుంబ సభ్యులు వారిద్దరినీ ఏం చేశారు? అసలు ఈ తతంగం ఎక్కడ జరిగింది? ఈ ప్రేమ వెనుక ఉన్న మరో రహస్యం సహా వివరాలన్నీ ఇప్పుడు తెలుసుకుందాం..

Also Read: మీరు లాజికల్‌గా ఆలోచించగలరా? ఈ పజిల్ పని పట్టండి..


అతనికి పెళ్లైంది.. ఇద్దరు పిల్లలున్నారు. ఆమెకు కూడా పెళ్లైంది.. నలుగురు పిల్లలు ఉన్నారు. కానీ, వారిద్దరి మధ్య ఏళ్ల నుంచి అక్రమ సంబంధం కొనసాగుతోంది. కానీ, ఇలాంటి విషయాలు ఎక్కువ కాలం దాగవు కదా.. వీరి విషయంలోనూ అదే జరిగింది. తాజాగా వీరిద్దరూ ఏకాంతంగా ఉన్న సమయంలో వారి కుటుంబ సభ్యులకు అడ్డంగా దొరికిపోయారు. బీహార్‌లోని పూర్నియా జిల్లా జలల్‌గఢ్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల బోచ్‌గావ్ పంచాయతీలోని లక్షన్ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

Also Read: 92 బంతుల్లో ఒక్క పరుగు.. ద్రవిడ్ మార్క్ ఇన్నింగ్స్!


ఆసిఫ్, అతని ప్రియురాలు ఇద్దరూ అరారియా జిల్లా గైడా పంచాయతీ సఫీపూర్ గ్రామానికి చెందినవారు. ఆసిఫ్‌తో మహిళకు రెండేళ్ల క్రితం పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా అక్రమ సంబంధానికి దారి తీసింది. అయితే, వీరి వ్యవహారం మహిళ అత్తింటి వారికి తెలిసింది. ఇదే వ్యవహారంపై గ్రామంలో పంచాయతీ కూడా పెట్టారు. గ్రామ పెద్దలు ఆసిఫ్‌ను చెప్పు దెబ్బలు కొట్టడంతో పాటు.. రూ. లక్ష జరిమానా విధించారు. అయితే, గ్రామ పెద్దల ఆదేశాలను ఆసిఫ్ ప్టటించుకోలేదు. ఆ తరువాత జలాల్‌ఘర్‌లోని లక్షన్‌పూర్ గ్రామంలోని తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్లింది మహిళ.

Also Read: కుమారి ఆంటీ ఫుడ్‌స్టాల్‌ వద్ద బాలీవుడ్‌ నటుడు సోనుసూద్‌ సందడి..


కొంతకాలంలో ఎవరికి వారు సైలెంట్‌గా ఉన్న వీరిద్దరూ.. మళ్లీ ఒక్కటయ్యారు. వీరిద్దరూ తరచూ కలుసుకోవడం ప్రారంభించారు. అయితే, తరచూ ఘర్షణలు జరుగుతుండటంతో భయపడిపోయిన మహిళ.. తన భర్తతోనే తాను కలిసి ఉంటానని, ఈ సమస్యలు ఇక చాలని ఆసిఫ్‌కు చెప్పింది. అయితే, ఆ మాటలను ఆసిఫ్ పట్టించుకోలేదు. ఆమెను బలవంతంగా పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలోనే శుక్రవారం రాత్రి మహిళ ఇంటికి వెళ్లాడు. ఉదయం అజాన్ సమయంలో మహిళ లేచి వాష్‌రూమ్‌కి వెళ్లగా.. దొంగచాటుగా ఇంట్లోకి దూరాడు ఆసిఫ్. ఆమె మంచంపై పడుకున్నాడు. ఇది గమనించిన మహిళ కుటుంబ సభ్యులు.. ఆసిఫ్‌ను పట్టుకుని చితకబాదారు. అతన్ని ఒక కర్రకు కట్టేసి.. చితక్కొట్టారు. అనంతరం.. అతని కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి పిలిపించారు. పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టి.. వారిలో వారు కాంప్రమైజ్ అయ్యారు. అయితే, ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు చెప్పారు.

For More National News and Telugu News..

Updated Date - Jul 06 , 2024 | 11:31 AM