Share News

BJP MLA: స్వామీజీలకు మరేమీ పనిలేదా..? ముఖ్యమంత్రుల మార్పు వారికెందుకు..?

ABN , Publish Date - Jul 03 , 2024 | 12:13 PM

రాష్ట్రంలో ముఖ్యమంత్రి మార్పు అంశంపై పలువురు స్వామిజీల వ్యాఖ్యలపై బీజేపీ సీనియర్‌ ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్‌ యత్నాళ్‌(Senior BJP MLA Basanagowda Patil Yatnal) తీవ్రంగా మండిపడ్డారు. స్వామిజీలకు మఠాలలో కూర్చోవడం తప్ప మరేమీ పనిలేదా అంటూ వ్యాఖ్యానించారు. సిద్దరామయ్య, డీకే శివకుమార్‌(Siddaramaiah and DK Shivakumar)ను క్రికెటర్లు రోహిత్‌శర్మ, విరాట్‌కోహ్లితో పోల్చిన వచనానందస్వామిజీపై విరుచుకుపడ్డారు.

BJP MLA: స్వామీజీలకు మరేమీ పనిలేదా..? ముఖ్యమంత్రుల మార్పు వారికెందుకు..?

- మత మార్పిడులపై ఏమి చేశారు?

- బీజేపీ ఎమ్మెల్యే యత్నాళ్‌ ఆగ్రహం

బెంగళూరు: రాష్ట్రంలో ముఖ్యమంత్రి మార్పు అంశంపై పలువురు స్వామిజీల వ్యాఖ్యలపై బీజేపీ సీనియర్‌ ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్‌ యత్నాళ్‌(Senior BJP MLA Basanagowda Patil Yatnal) తీవ్రంగా మండిపడ్డారు. స్వామిజీలకు మఠాలలో కూర్చోవడం తప్ప మరేమీ పనిలేదా అంటూ వ్యాఖ్యానించారు. సిద్దరామయ్య, డీకే శివకుమార్‌(Siddaramaiah and DK Shivakumar)ను క్రికెటర్లు రోహిత్‌శర్మ, విరాట్‌కోహ్లితో పోల్చిన వచనానందస్వామిజీపై విరుచుకుపడ్డారు. బెంగళూరులో మంగళవారం యత్నాళ్‌ మీడియాతో మాట్లాడుతూ మఠాలలో ఉండే స్వామిజీలు ఆధ్యాత్మికత గురించి ఆలోచించాలని, ఇలాంటి వ్యాఖ్యలు సరికాదన్నారు. మతమార్పిడులు జరుగుతున్నాయని, లవ్‌జిహాది సాగుతోందని వాటిపై స్వామిజీలు ఏం చేశారని ప్రశ్నించారు.

ఇదికూడా చదవండి: లేఖ రాసిన వింత దొంగ.. నెలలో అన్నీ తిరిగి ఇచ్చేస్తానంటూ చోరీ


ఇటువంటి సామాజిక అంశాలపై స్వామిజీలు పోరాడాలని, ముఖ్యమంత్రుల మార్పు వీరికెందుకని ప్రశ్నించారు. గతంలో హరిహరస్వామిజీ, బీజేపీ నే త మురుగేశ్‌నిరాణిని మంత్రిగా చేయాలని లేదా పంచమశాలిలంతా వ్యతిరేకమమవుతామని హెచ్చరించిన విషయాన్ని గుర్తు చేశారు. ఇటీవల చంద్రశేఖరస్వామిజీ, డీకే శివకుమార్‌ కోసం సిద్దరామ య్య సీఎం స్థానాన్ని వదులుకోవాలని వ్యాఖ్యానించగా లింగాయత స్వామిజీలు మా వారికి సీఎం పదవి ఇవ్వాలంటూ వ్యాఖ్యానించడాన్ని ప్రస్తావించారు.


ఇదికూడా చదవండి: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - Jul 03 , 2024 | 12:13 PM