Share News

Jammu-Jodhpur Express: ఎక్స్‌ప్రెస్‌ రైలుకు బాంబు బెదిరింపు.. ప్రయాణికులను దింపి ముమ్మర తనిఖీలు

ABN , Publish Date - Jul 30 , 2024 | 03:33 PM

జార్ఖండ్‌లో ముంబయి- హౌరా ఎక్స్‌ప్రెస్ రైలు మంగళవారం తెల్లవారుజామున పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో వరుస రైలు ప్రమాదాలు జరుగుతున్నాయి.

Jammu-Jodhpur Express: ఎక్స్‌ప్రెస్‌ రైలుకు బాంబు బెదిరింపు.. ప్రయాణికులను దింపి ముమ్మర తనిఖీలు

న్యూఢిల్లీ, జులై 30: జార్ఖండ్‌లో ముంబయి- హౌరా ఎక్స్‌ప్రెస్ రైలు మంగళవారం తెల్లవారుజామున పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో వరుస రైలు ప్రమాదాలు జరుగుతున్నాయి. దీంతో ప్రభుత్వ వైఫల్యం వల్లే ఈ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయంటూ మోదీ ప్రభుత్వంపై ప్రతిపక్ష పార్టీల నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.

Also Read: Jharkhand train accident: ఇదా నా పాలన.. మోదీ ప్రభుత్వానికి చురకలంటించిన సీఎం మమత


ఓ వైపు రైలు ప్రమాదం.. మరోవైపు బాంబు బెదిరింపు..

సరిగ్గా అలాంటి వేళ.. జమ్మూ నుంచి రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌ వెళ్తున్న ఎక్స్‌ప్రెస్ రైలుకు మంగళవారం బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో పంజాబ్‌‌లోని కాసు బేగ్ రైల్వే స్టేషన్‌లో రైలును నిలిపివేశారు. అనంతరం ప్రయాణికులను దింపి వేసి.. రైలులో ముమ్మర తనిఖీలు చేపట్టారు. అందులోభాగంగా బాంబు స్క్వాడ్, ఆగ్నిమాపక దళంతోపాటు వైద్య బృందాలు సైతం కాసు బేగ్ రైల్వే స్టేషన్‌కు చేరుకున్నాయి.

Also Read: Indians: గత అయిదేళ్లలో.. 633 మంది విద్యార్థులు మృతి


స్పందించిన ఫిరోజ్‌పూర్ ఎస్పీ..

పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్ స్టేషన్ దాటిన అనంతరం జోధ్‌పూర్ ఎక్స్‌ప్రెస్ రైలులో బాంబు పెట్టినట్లు పోలీసులకు ఆగంతకుడు ఫోన్‌ చేశాడు. దాంతో ఫిరోజ్‌పూర్‌కు 10 కిలోమీటర్ల దూరంలోని కాసు బేగ్ రైల్వే స్టేషన్‌ వద్ద ఈ ఎక్స్‌ప్రెస్ రైలును నిలిపి వేశారు. ఈ సందర్బంగా ఫిరోజ్‌పూర్ జిల్లా ఎస్పీ రణధీర్ కుమార్ సంఘటన స్థలానికి చేరుకుని.. పరిస్థితిని సమీక్షించారు. అనంతరం ఎస్పీ రణధీర్ మాట్లాడుతూ.. పరిస్థితి మొత్తం పూర్తి అదుపులోనే ఉందన్నారు. అన్ని జాగ్రత్త చర్యలు తీసుకున్నట్లు చెప్పారు.

Also Read: Jaya Amitabh Bachchan: సభలో జయా బచ్చన్ ‘అసహనం’


ఆగస్ట్ 15వ తేదీ లక్ష్యంగా..

మరోవైపు ఇండోర్ ఐఐటీ క్యాంపస్‌లోని కేంద్రీయ విశ్వవిద్యాలయం పాఠశాల భవనాన్ని ఆగస్ట్ 15వ తేదీన పేల్చివేస్తామంటూ ఈ మెయిల్ ద్వారా బెదిరింపులు అందాయని పోలీసులు తెలిపారు. దీంతో ఆ యా ప్రాంతాల్లో భద్రతను పెంచామన్నారు.

Also Read: Opposition Parties: ఈ ప్రభుత్వానికి సిగ్గని మాత్రం అనిపించడం లేదు


ఇది ఒక్కటే కాదు.. గతంలో...

అలాగే ఈ ఏడాది మేలో న్యూఢిల్లీలోని పలు పాఠశాలలకు సైతం బాంబు బెదిరింపులు వెల్లువెత్తాయి. దాంతో ఆ యా పాఠశాలల్లోని విద్యార్థులను ఇంటికి పంపి.. తనిఖీలు చేపట్టారు. అనంతరం అవి నకిలీ బాంబు బెదిరింపులని పోలీసులు గుర్తించారు. అదే విధంగా దేశంలోని వివిధ ఎయిర్‌పోర్ట్‌లకు సైతం ఇదే తరహాలో బాంబు బెదిరింపులు వచ్చాయి.

Also Read: Karnataka: సీఎంకు వ్యతిరేకంగా పాదయాత్ర.. అనుమతి ఇవ్వని సర్కారు


దీంతో ప్రయాణికులను బయటకు పంపి.. ఎయిర్‌పోర్ట్‌లో తనిఖీలను భద్రతా సిబ్బంది ముమ్మరం చేశారు. అవి సైతం నకిలీ బెదిరింపులని పోలీసులు గుర్తించారు. ఇక ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆర్కే పురంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌కు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఇది కూడా నకిలీ బాంబు బెదిరింపులు కావడంతో.. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Also Read: Jharkhand: పట్టాలు తప్పిన ముంబయి- హౌరా ఎక్స్‌ప్రెస్ రైలు

Also Read: President Murmu: ఆగస్టు 5 నుంచి రాష్ట్రపతి విదేశీ పర్యటన

Read More National News and Latest Telugu News

Updated Date - Jul 30 , 2024 | 03:35 PM