Home » Jharkhand
ఝార్ఖండ్లో తాజాగా రైలు ప్రమాదం సంభవించింది. నిలిపి ఉంచిన గూడ్స్ రైలును మరో గూడ్స్ రైలు ఢీకొనడంతో ఇద్దరు లోకో పైలట్లు దుర్మరణం చెందారు.
దాదాపు నాలుగు లక్షల మందికిపైగా విద్యార్థులు రాస్తున్న టెన్త్ బోర్డ్ ఎగ్జామ్ పేపర్ లీకైంది. పరీక్షకు ముందే అవి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. విషయం తెలుసుకున్న అధికారులు రెండు పరీక్షలను రద్దు చేశారు. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.
ఒడిశా గవర్నర్ పదవికి ఇటీవల రాజీనామా చేసిన జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి రఘుబర్ దాస్, క్రియాశీల రాజకీయాల్లో తన రెండో ఇన్నింగ్స్ను అధికారికంగా ప్రారంభించారు. శుక్రవారం రాంచీలో వేలాది మంది మద్దతుదారులు, ప్రముఖ నాయకుల సమక్షంలో ఆయన భారతీయ జనతా పార్టీలో చేరారు.
పూజా సింఘాల్ న్యాయపోరాటంలో పలు ఆటుపోట్లు చవిచూశారు. సుప్రీంకోర్టు సైతం గతంలో ఆమె దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను తోసిపుచ్చింది. అయితే అనారోగ్యంతో బాధపడుతున్న తన కుమార్తెను చూసేందుకు 2023 ఫిబ్రవరిలో ఆమెకు అత్యున్నత న్యాయస్థానం తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది.
కాంగ్రెస్కు చెందిన రాధాకృష్ణ కిషోర్కు నాలుగు శాఖల బాధ్యతలు అప్పటించారు. దీపికా పాండే, సుదివ్య సోను, ఇర్ఫాన్ అన్సారీలకు మూడేసి మంత్రిత్వ శాఖలను కేటాయించారు. హఫీజుల్ హసన్, యోగేంద్ర ప్రసాద్, చమ్రా లిండా, రాందాస్ సోరెన్, దీపక్ బిరువా, సంజయ్ ప్రసాద్ యాదవ్లకు..
ఝార్ఖండ్ రాష్ట్ర 14వ ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకారం చేశారు. రాంచీలోని మోరబడి గ్రైండ్లో ‘ఇండియా’ కూటమి నేతల సమక్షంలో గురువారం ఈ
జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు ఇటీవల జరిగాయి. ఆ రాష్ట్ర ఓటరు ఇండియా కూటమిలోని జార్ఖండ్ మూక్తి మోర్చా (జేఎంఎం) పార్టీకి పట్టం కట్టారు. ఆ పార్టీతోపాటు భాగస్వామ్య పక్షాలు అత్యధిక స్థానాలు గెలుచుకుంది. దీంతో గురువారం జార్ఖండ్ సీఎంగా హేమంత్ సోరెన్ మరోసారి బాధ్యతలు చేపట్టారు.
జార్ఖండ్ రాష్ట్రానికి హేమంత్ సోరెన్ నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. 2013లో తొలిసారి సీఎం పదవి పగ్గాలు చేపట్టారు. గత ఏడాది మనీ లాండరింగ్ ఆరోపణలు రావడం, ఈడీ అరెస్ట్ చేయడంతో హేమంత్ సోరెన్ సీఎం పదవికి రాజీనామా చేశారు. ఆ కేసులో బెయిల్ రావడంతో బయటకు వచ్చారు. సీఎం పదవి బాధ్యతలను స్వీకరించారు.
హేమంత్ సోరెన్ కూటమి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 81 స్థానాలకు గాను 56 స్థానాలు గెలుచుకుని రెండోసారి కూడా అధికారాన్ని సొంతం చేసుకుంది. బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే 24 స్థానాలు సొంతం చేసుకుంది.
జార్ఖండ్ కొత్త సీఎంగా హేమంత్ సోరెన్ బాధ్యతలు చేపట్టేందుకు ముహూర్తం ఖరారు అయింది. అంతకుముందు గవర్నర్ సంతోష్ గాంగ్వార్తో జేఎంఎం అధినేత హేమంత్ సోరెన్ ఆదివారం రాజ్భవన్లో సమావేశమయ్యారు.