Home » Jharkhand
ఝార్ఖండ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి, కాంగ్రెస్ నేత ఆలంగీర్ ఆలమ్(70)ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) మనీలాండరింగ్ కేసులో బుధవారం అరెస్టు చేసింది. ఆలంగీర్ ఆలమ్ పర్సనల్ సెక్రటరీ(పీఎస్) సంజీవ్ లాల్ పని మనిషి జహంగీర్ ఆలమ్ ఇంట్లో రూ.35.23 కోట్లు దొరికిన కేసులో ఈడీ చర్యలు తీసుకుంది. ఆలంగీర్ ఆలమ్ను బుధవారం వరుసగా రెండో రోజు విచారణకు పిలిచిన ఈడీ ఆయన్ను అరెస్టు చేసినట్టు ప్రకటించింది.
మనీ లాండరింగ్ కేసులో జార్ఖాండ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి, కాంగ్రెస్ నేత అలంగీర్ ఆలమ్ ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ బుధవారంనాడు అరెస్టు చేసింది. ఈ కేసులో ఆలమ్ను సుమారు తొమ్మిది గంటల సేపు ప్రశ్నించిన ఈడీ అధికారులు అయన నుంచి సంతృప్తికరమైన సమాధానం రాకపోవడంతో అరెస్టు చేసింది.
జార్ఘాండ్ మంత్రి అలంగీర్ ఆలమ్ చిక్కుల్లో పడ్డారు. ఆయన పర్సనల్ సెక్రటరీ సంజీవ్ లాల్ సహాయకుడి ఇంట్లో భారీగా నోట్ల కట్టలు పట్టుబడటంతో మంత్రి అలంగీర్కు ఈడీ నోటీసులు పంపింది. ఈనెల 14న తమ ముందు హాజరుకావాలని ఈడీ ఆయనను కోరింది.
గుట్టలు గుట్టలుగా నోట్ల కట్టలు.. గంటలు గడిచిన కొద్దీ లెక్క పెరుగుతూ పోయింది.. పలువురు అధికారులు యంత్రాల సాయంతో నిర్విరామంగా శ్రమిస్తే కానీ ఓ కొలిక్కి రాలేదు.
లోక్సభ ఎన్నికల సందర్భంగా జార్ఖండ్(Jharkhand)లో పెద్ద ఎత్తున నగదు లభ్యమైంది. రాంచీలోని పలు ప్రాంతాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాడులు చేస్తున్న క్రమంలో జార్ఖండ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఆలంగీర్ ఆలం(Alamgir Alam) వ్యక్తిగత కార్యదర్శిగా ఉన్న సంజీవ్ లాల్ సహాయకుడి ఇంట్లో నుంచి భారీ మొత్తంలో నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
దేశంలోని అవినీతిపరుల మాస్కులను ఎన్డీయే ప్రభుత్వం తొలగించివేసిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు.
లోక్ సభ ఎన్నికల వేళ అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ పరస్పర ఆరోపణలతో రాజకీయాల్ని హీటెక్కిస్తున్నాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ(PM Modi) మే 4న జార్ఖండ్ పాలములోని ఎన్నికల ర్యాలీలో(Lok Sabha Polls 2024) పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష కాంగ్రెస్, జేఎంఎం నేతలపై మోదీ విరుచుకుపడ్డారు.
దేశ వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో బర్డ్ ఫ్లూ కేసులు కలకలం సృష్టిస్తున్నాయి. వదిలిపోయిందన్ని ఈ వైరస్ రక్కసి మళ్లీ జన సంచారంలోకి రావడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. తాజాగా జార్ఖండ్లో సైతం బర్డ్ ఫ్లూ కేసులు విజృంభించాయి.
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal), జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్(Hemanth Sorean) అరెస్టును నిరసిస్తూ ఇండియా కూటమి (INDIA Bloc)వినూత్నంగా నిరసన తెలిపింది. ఆదివారం కూటమి ఆధ్వర్యంలో బీజేపీకి వ్యతిరేకంగా జార్ఖండ్లో మెగా ర్యాలీ నిర్వహించారు. ఇందులో 28 ప్రతిపక్ష పార్టీలు పాల్గొన్నాయి. అక్రమంగా తమ నేతలను అరెస్టు చేశారని ప్రతిపక్షాలు ఆరోపించాయి.
వేసవి కాలం కావడంతో దేశ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో విపరీతంగా వేడి గాలులు వీస్తున్నాయి. ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటుతూ ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. ఇలాంటి సమయంలో విద్యార్థులు బయట తిరిగితే ప్రమాదమని భావించిన పలు రాష్ట్ర ప్రభుత్వాలు విద్యా సంస్థలకు సెలవులు ప్రకటిస్తున్నాయి.