Share News

Madhya Pradesh: ఇద్దరు వ్యక్తులపై తోడేలు దాడి.. యూపీలో మరో తోడేలు పట్టివేత

ABN , Publish Date - Sep 10 , 2024 | 03:56 PM

వరుస తోడేళ్ల దాడితో ఉత్తరప్రదేశ్‌లో పలు జిల్లాల్లోని ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో తోడేళ్లను పట్టుకునేందుకు ‘ఆపరేషన్ బేడియా’ను ప్రభుత్వం చేపట్టింది. అందులో భాగంగా పలు తోడేళ్లను అటవీ శాఖ అధికారులు బంధించారు.

Madhya Pradesh: ఇద్దరు వ్యక్తులపై తోడేలు దాడి.. యూపీలో మరో తోడేలు పట్టివేత

సీహోర్, సెప్టెంబర్ 10: వరుస తోడేళ్ల దాడితో ఉత్తరప్రదేశ్‌లో పలు జిల్లాల్లోని ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో తోడేళ్లను పట్టుకునేందుకు ‘ఆపరేషన్ బేడియా’ను ప్రభుత్వం చేపట్టింది. అందులో భాగంగా పలు తోడేళ్లను అటవీ శాఖ అధికారులు బంధించారు. మరోవైపు మధ్యప్రదేశ్‌లోని సీహోర్ జిల్లాలో ఇద్దరు వ్యక్తులపై తోడేలు దాడి చేసింది.

Also Read: Rahul Gandhi: యూఎస్ పర్యటనలో మళ్లీ కీలక వ్యాఖ్యలు


ఇద్దరు వ్యక్తులు రహదారి పక్కన కూర్చుని ఉన్నారు. అంతలో పొదల్లో నుంచి వచ్చిన ఓ తోడేలు.. వారిపై దాడికి యత్నించింది. వెంటనే వారిద్దరు స్పందించారు. అనంతంర తోడేలుపై వారు ఎదురు దాడికి దిగారు. ఇది సమీపంలోని సీసీ కెమెరాలో నిక్షిప్తమైంది. అందుకు సంబంధించిన వీడియో.. అటు మీడియాలో ఇటు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతుంది.

Also Read: Ganesh Chaturthi: తొలి రోజే ఈ ‘గణపతి’రికార్డు


wolf1.jpg

మరోవైపు ఉత్తరప్రదేశ్‌లో మంగళవారం తెల్లవారుజామున మరో తోడేలును అటవీ శాఖ అధికారులు బంధించారు. దీంతో ఇప్పటి వరకు బంధించిన తోడేళ్ల సంఖ్య 5కు చేరింది. అయితే మరో తోడేలు మాత్రం తప్పించుకుందని తెలిపారు. ఈ తోడేలును సైతం సాధ్యమైనంత త్వరగా పట్టుకుంటామని అటవీ శాఖ ఉన్నతాధికారులు వెల్లడించారు.

Also Read: Kolkata doctor's mother: సీఎం మమత వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన హత్యాచార వైద్యురాలి తల్లి


అయితే తోడేలు వెంట.. వెంటనే అంటే.. 10 నుంచి 15 సార్లు తన స్థావరాలను మార్చుకుంటుందన్నారు. ఈ నేపథ్యంలో వాటిని బంధించడం కాస్తా ఆలస్యమవుతుందని చెప్పారు. సోమవారం నత్వాపూర్‌లో మేకను తోడేలు ఎత్తుకెళ్లినట్లు తమకు ఫిర్యాదు అందిందన్నారు. దీంతో ఆ పరిసర ప్రాంతాల్లో తోడేలును పట్టుకునేందుకు వలలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

Also Read: West Bengal: మమత ప్రభుత్వంలో ‘అవినీతి’పై మాజీ ఎంపీ ఆరోపణలు


యూపీలోని బహరాయిచ్ జిల్లాలోని చిన్నారులే లక్ష్యంగా చేసుకుని తోడేళ్లు దాడి చేస్తున్నాయి. అలా ఇప్పటి వరకు 10 మంది ప్రాణాలు తీశాయి. ఈ నేపథ్యంలో తోడేళ్ల కనిపిస్తే కాల్చివేయాలంటూ యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అంతకు ముందు ఇదే జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో చిన్నారులపై తోడేళ్లు దాడి చేస్తున్నాయి. దీంతో తోడేళ్లను పట్టుకునేందుకు ‘ఆపరేషన్ బేడియా’ పేరటి యోగి ప్రభుత్వం చర్యలు చేపట్టిన విషయం విధితమే.

Also Read: Ganesh Chaturthi: లంబోదరుడికి భారీ లడ్డూ.. ఎన్ని కేజీలంటే..?

Read More National News and Latest Telugu New

Updated Date - Sep 10 , 2024 | 04:04 PM