Share News

శంకర్‌ ఐఏఎస్‌ అకాడమీకి రూ.5 లక్షలు ఫైన్‌

ABN , Publish Date - Sep 02 , 2024 | 04:05 AM

కేంద్ర వినియోగదారుల రక్షణ సంస్థ(సీసీపీఏ) 2022 సివిల్‌ సర్వీస్‌ పరీక్షకు సంబంధించి తప్పుదోవ పట్టించేలా ప్రకటన ఇచ్చినందుకు శంకర్‌ ఐఏఎస్‌ అకాడమీకి రూ.5 లక్షల జరిమానా విధించింది.

శంకర్‌ ఐఏఎస్‌ అకాడమీకి రూ.5 లక్షలు ఫైన్‌

న్యూఢిల్లీ, సెప్టెంబరు 1 : కేంద్ర వినియోగదారుల రక్షణ సంస్థ(సీసీపీఏ) 2022 సివిల్‌ సర్వీస్‌ పరీక్షకు సంబంధించి తప్పుదోవ పట్టించేలా ప్రకటన ఇచ్చినందుకు శంకర్‌ ఐఏఎస్‌ అకాడమీకి రూ.5 లక్షల జరిమానా విధించింది. 2022 సివిల్‌ సర్వీసు పరీక్షకు సంబంధించి ఆ అకాడమీ ఇచ్చిన ప్రకటనలో ఆల్‌ ఇండియా స్థాయిలో ఎంపికైన 933 మందిలో 336 మంది తమ అకాడమీలో శిక్షణ పొందారని, 40 మంది టాప్‌ 100లో ఉన్నారని పేర్కొన్నారు. దీనిపై సీసీపీఏ విచారించగా సివిల్స్‌లో ఎంపికైన అభ్యర్థులు శంకర్‌ ఐఏఎస్‌ అకాడమీలో ఎంపిక చేసుకున్న కోర్సులకు సంబంధించి ఇచ్చిన సమాచారం తప్పని తేలింది.

Updated Date - Sep 02 , 2024 | 04:05 AM