Share News

Chennai : ఐఐటీ మద్రాస్‌ నుంచి ఇస్రో చైర్మన్‌ పీహెచ్‌డీ

ABN , Publish Date - Jul 20 , 2024 | 05:04 AM

ఇస్రో చైర్మన్‌ ఎస్‌.సోమనాథ్‌ ఐఐటీ మద్రాస్‌ నుండి పీహెచ్‌డీ డిగ్రీ స్వీకరించారు. శుక్రవారం జరిగిన ఐఐటీ మద్రాస్‌ 61వ స్నాతకోత్సవంలో ఆయన ఈ పట్టాను అందుకున్నారు.

Chennai : ఐఐటీ మద్రాస్‌ నుంచి ఇస్రో చైర్మన్‌ పీహెచ్‌డీ

చెన్నై, జూలై 19(ఆంధ్రజ్యోతి): ఇస్రో చైర్మన్‌ ఎస్‌.సోమనాథ్‌ ఐఐటీ మద్రాస్‌ నుండి పీహెచ్‌డీ డిగ్రీ స్వీకరించారు. శుక్రవారం జరిగిన ఐఐటీ మద్రాస్‌ 61వ స్నాతకోత్సవంలో ఆయన ఈ పట్టాను అందుకున్నారు. ఈ స్నాతకోత్సవంలో 3,016 మంది విద్యార్థులు పట్టాలను అందుకున్నారు. 444 మంది అభ్యర్థులు పీహెచ్‌డీలు స్వీకరించారు. వీరిలో ఇస్రో చైర్మన్‌ ఎస్‌.సోమనాథ్‌ కూడా ఉండటం విశేషం. మెకానికల్‌ ఇంజనీరింగ్‌లో విస్తృత పరిశోధనలు జరిపినందుకు ఈ పీహెచ్‌డీని ప్రదానం చేసినట్లు ఐఐటీ మద్రాస్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ వి.కామకోటి తెలిపారు.

Updated Date - Jul 20 , 2024 | 05:06 AM