Share News

Chennai: త్వరలో రూ.100 కరుణానిధి స్మారక నాణేం..

ABN , Publish Date - Jul 11 , 2024 | 12:43 PM

దివంగత మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి(Karunanidhi) శతజయంతి వేడుకల సందర్భంగా రూ.100 విలువైన స్మారక నాణేలను విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతిచ్చినట్లు అధికారులు తెలిపారు.

Chennai: త్వరలో రూ.100 కరుణానిధి స్మారక నాణేం..

చెన్నై: దివంగత మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి(Karunanidhi) శతజయంతి వేడుకల సందర్భంగా రూ.100 విలువైన స్మారక నాణేలను విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతిచ్చినట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రప్రభుత్వం ఈ మేరకు కేంద్ర ఆర్ధిక మంత్రిత్వ శాఖ(Union Ministry of Finance)కు లేఖ రాసింది. కరుణానిధి స్మారక నాణేన్ని ఆయన జయంతి రోజైన జూన్‌ 3వ తేది శతజయంతి ముగింపు వేడుకల సందర్భంగా విడుదల చేయాలని గతంలో నిర్ణయించారు.

ఇదికూడా చదవండి: BJP State Chief: బీజేపీ రాష్ట్రచీఫ్ శపథం.. ఆర్‌ఎస్‌ భారతిని జైలుకు పంపిస్తాం..


అయితే కొన్ని కారణాల వల్ల కేంద్ర ప్రభుత్వం ఈ నాణెం ఆ రోజు విడుదల చేయలేదు. ఈ నేపథ్యంలో, కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌ రూ.100 విలవైన కరుణానిధి స్మారక నాణెం విడుదల చేసేందుకు అనుమతిచ్చారని సచివాలయం బుధవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.


ఇదికూడా చదవండి: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - Jul 11 , 2024 | 12:43 PM