Share News

NTA : సిస్ఐర్-యూజీసీ నెట్‌ పరీక్ష వాయిదా

ABN , Publish Date - Jun 22 , 2024 | 03:14 AM

నీట్‌ పేపర్‌ లీకేజీపై తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్టీయే) మరో పరీక్షను వాయిదా వేసింది.

 NTA :  సిస్ఐర్-యూజీసీ నెట్‌ పరీక్ష వాయిదా

న్యూఢిల్లీ, జూన్‌ 21 : నీట్‌ పేపర్‌ లీకేజీపై తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్టీయే) మరో పరీక్షను వాయిదా వేసింది. ఈ నెల 25, 27 తేదీల్లో నిర్వహించాల్సిన జాయింట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ సైంటిఫిక్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ రీసెర్చ్‌ అండ్‌ యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ నేషనల్‌ ఎలజిబిలిటీ టెస్ట్‌(సీఎ్‌సఐఆర్‌-యూజీసీ నెట్‌)ను వాయిదా వేస్తున్నట్టు శుక్రవారం ప్రకటించింది.

జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలోషిప్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, అత్యున్నత విద్యా సంస్థల్లో సైన్స్‌ కోర్సుల్లో పీహెచ్‌డీ ప్రవేశాలకు అర్హత పరీక్షగా ఎన్టీయే ప్రతీ ఏటా జూన్‌, డిసెంబరులో సీఎ్‌సఐఆర్‌-యూజీసీ నెట్‌ నిర్వహిస్తుంటుంది. తప్పనిసరి పరిస్థితుల్లో జూన్‌ విడత పరీక్షను వాయిదా వేసినట్టు వెల్లడించింది. యూజీసీ-నెట్‌ పరీక్షను రద్దు చేసిన రెండ్రోజులకే ఈ నిర్ణయం వెలువడడం గమనార్హం.

Updated Date - Jun 22 , 2024 | 07:08 AM