Share News

INC: కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం రేపు.. సభలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చ

ABN , Publish Date - Jul 21 , 2024 | 11:35 AM

బడ్జెట్ సమావేశాల వ్యూహాన్ని రూపొందించేందుకు కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ (CPP) చైర్‌పర్సన్ సోనియా గాంధీ అధ్యక్షతన సోమవారం (జులై 22) కాంగ్రెస్ పార్లమెంటరీ సమావేశం జరుగుతుందని ఆ పార్టీ తెలిపింది. సోనియా గాంధీ నివాసంలో ఈ సమావేశం జరగనుంది.

INC: కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం రేపు.. సభలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చ

ఢిల్లీ: బడ్జెట్ సమావేశాల వ్యూహాన్ని రూపొందించేందుకు కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ (CPP) చైర్‌పర్సన్ సోనియా గాంధీ అధ్యక్షతన సోమవారం (జులై 22) కాంగ్రెస్ పార్లమెంటరీ సమావేశం జరుగుతుందని ఆ పార్టీ తెలిపింది. సోనియా గాంధీ నివాసంలో ఈ సమావేశం జరగనుంది.

మరోవైపు పార్లమెంట్ వర్షాకాల బడ్జెట్ సమావేశాలు (Parliament Budget Sessions) సోమవారం నుంచి ప్రారంభంకానున్న నేపథ్యంలో ఆదివారం ఉదయం 11 గంటలకు అఖిలపక్ష సమావేశం జరగనుంది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు (Kiran Rijiju) అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. పార్లమెంట్ ఉభయ సభల్లో రాజకీయ పార్టీల ఫ్లోర్ లీడర్లతో ఈ భేటీ జరుగుతుంది. జూలై 22వ తేదీ నుంచి ఆగస్టు 12వ తేదీ వరకు పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి.


కాగా కేంద్ర ఆర్ధికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ 23న బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. దానికి ముందురోజు (సోమవారం) ఆర్థిక సర్వేను నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టనున్నారు. వివిధ రంగాల ఆర్థిక స్థితిగతులకు సంబంధించిన గణాంక సమాచారం, విశ్లేషణలతోపాటు ఉపాధి, జీడీపీ వృద్ధి, ద్రవ్యోల్బణం, బడ్జెట్‌లోటు తదితరాలను ఆర్థిక సర్వే వెల్లడించనుంది.


ముఖ్య ఆర్థిక సలహాదారు వి.అనంత నాగేశ్వరన్‌ నేతృత్వంలోని బృందం ఆర్థిక సర్వేను రూపొందించింది. మరోవైపు నీట్‌ ప్రశ్నపత్రం లీకైన కేసు, రైల్వే భద్రత తదితర అంశాలపై ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్షాలు సిద్ధమయ్యాయి. ఆగస్టు 12వ తేదీ వరకు కొనసాగే ఈ సమావేశాలలో 90 ఏళ్ల నాటి పౌర విమానయాన చట్టం స్థానంలో కొత్త చట్టాన్ని తీసుకురావడం సహా ఆరు బిల్లులను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. దీంతోపాటు ప్రస్తుతం కేంద్ర పాలనలో ఉన్న జమ్మూకశ్మీర్‌ బడ్జెట్‌కు పార్లమెంటు ఆమోదం తెలిపే అవకాశం ఉంది.


నిబంధనలివే..

సభాధ్యక్షుడి ఆదేశాలను ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎక్కడా విమర్శించకూడదని ఎంపీలకు స్పష్టం చేశారు. సభలో వందేమాతరం, జైహింద్‌ సహా నినాదాలేమీ చేయకూడదని తేల్చిచెప్పారు. సభలో ప్లకార్డులు తదితరాలు ప్రదర్శించడమూ పద్ధతి కాదంటూ.. పార్లమెంటరీ ఆచారాలు, సంప్రదాయాలపై సభ్యులు దృష్టిపెట్టేలా ‘రాజ్యసభ సభ్యుల కోసం హేండ్‌ బుక్‌’ను రాజ్యసభ సెక్రటేరియట్‌ తీసుకొచ్చింది.

అయితే ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 240 సీట్లు గెలుచుకుంది. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ 99 సీట్లు గెలుచుకుని ఈసారి లోక్ సభలో తొలిసారి విపక్ష హోదా దక్కించుకుంది. BJP నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ 293 సీట్లు గెలుచుకోగా, ప్రతిపక్ష ఇండియా కూటమి 230 సీట్లు సాధించింది ఎన్డీయేకు గట్టి పోటీనిచ్చింది.

Read Latest Telangana News and National News

Updated Date - Jul 21 , 2024 | 11:35 AM