Share News

Delhi : అభ్యర్థిత్వం రద్దుపై ఢిల్లీ హైకోర్టుకు ఖేద్కర్‌

ABN , Publish Date - Aug 06 , 2024 | 05:31 AM

వివాదాస్పద మాజీ ట్రైనీ ఐఏఎస్‌ పూజా ఖేద్కర్‌ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తన అభ్యర్థిత్వాన్ని యూపీఎస్సీ రద్దు చేయడాన్ని సవాలు చేస్తూ...

Delhi : అభ్యర్థిత్వం రద్దుపై ఢిల్లీ హైకోర్టుకు ఖేద్కర్‌

వివాదాస్పద మాజీ ట్రైనీ ఐఏఎస్‌ పూజా ఖేద్కర్‌ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తన అభ్యర్థిత్వాన్ని యూపీఎస్సీ రద్దు చేయడాన్ని సవాలు చేస్తూ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఆమె సమర్పించిన పిటిషన్‌ బుఽధవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది. పూజా ఖేద్కర్‌.. మోసపూరితంగా ఓబీసీ, వికలాంగుల కోటాలో ఉద్యోగం పొందినట్లు ఆరోపణల నేపథ్యంలో ఏకసభ్య కమిషన్‌ నివేదిక మేరకు యూపీఎస్సీ ఆమె సభ్యత్వాన్ని రద్దు చేసిన విషయం తెలిసిందే.

Updated Date - Aug 06 , 2024 | 05:31 AM