Share News

Suvendu Adhikari: ఆర్‌జీ కార్ ఆసుపత్రిపై దాడి.. హోం శాఖ కార్యదర్శికి లేఖ

ABN , Publish Date - Aug 15 , 2024 | 08:06 PM

కోల్‌కతాలోని ఆర్‌జీ కార్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో కేంద్ర భద్రత దళాలను మోహరించాలని ఢిల్లీలోని హోం శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ కుమార్ భ్లలాతోపాటు సీబీఐ డైరెక్టర్‌కు బీజేపీ నేత, ఎమ్మెల్యే సువేందో అధికారి విజ్ఞప్తిచేశారు.

Suvendu Adhikari: ఆర్‌జీ కార్ ఆసుపత్రిపై దాడి.. హోం శాఖ కార్యదర్శికి లేఖ

కోల్‌కతా, ఆగస్ట్ 15: పోస్ట్ గ్రాడ్యుయేషన్ టైయినీ విద్యార్థిపై హత్యాచారం జరిగిన కోల్‌కతాలోని ఆర్‌జీ కార్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిపై గత అర్థరాత్రి దుండగులు దాడి చేయడంపై ఆ రాష్ట్ర బీజేపీ నేత, అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు సువేందో అధికారి స్పందించారు. ఈ కాలేజీ ఆసుపత్రిలో కేంద్ర భద్రత దళాలను మోహరించాలని ఢిల్లీలోని హోం శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ కుమార్ భ్లలాతోపాటు సీబీఐ డైరెక్టర్‌కు ఈ సందర్భంగా ఆయన విజ్ఞప్తి చేశారు.

Also Read: Akasa Air Flight: భోపాల్‌లో విమానం అత్యవసర ల్యాండింగ్.. ప్రయాణికుడు మృతి

Also Read: RG Kar Medical College Student: కుమార్తె చనిపోయే ముందు డైరీలో ఏం రాసిందంటే..


ఈ మేరకు గురువారం తన ఎక్స్ ఖాతా వేదికగా వారికి విజ్ఞప్తి చేశారు. ఈ ఆసుపత్రిలో ట్రైయినీ వైద్యురాలిపై హత్యాచారానికి సంబంధించిన ఆధారాలు రూపుమాపేందుకు ప్రయత్నం జరుగుతుందని ఆయన సందేహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఈ కాలేజీ ఆసుపత్రి వద్ద కేంద్ర భద్రత దళాలను మోహరించడం ద్వారా ఆ ఆధారాలను పరిరక్షించాలని వారికి సువేందో అధికారి సూచించారు. ఈ కాలేజీ ఆసుపత్రిపై దాడికి రౌడీ మూకలను అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ పంపిందని ఈ సందర్భంగా సువేందో అధికారి ఆరోపించారు.

Also Read: Varalakshmi Vratham 2024: వరలక్ష్మీ వ్రతానికి శుభ ముహూర్తం ఇదే..

Also Read: Jammu Kashmir Assembly Elections: డీజీపీగా నళిన్ ప్రభాత్

Also Read: Sunita Kejriwal: సీఎం కేజ్రీవాల్ సతీమణి తీవ్ర అసంతృప్తి.. ఎందుకంటే..?


మరోవైపు.. గత శుక్రవారం తెల్లవారుజామున ఆసుపత్రిలోని సెమినార్ హాల్‌లో ట్రైయినీ వైద్య విద్యార్థిపై హత్యాచారం జరిగింది. అందుకు సంబంధించిన పోస్ట్‌మార్టం నివేదికలో పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. మరోవైపు ఆమెపై సామూహిక లైంగిక దాడి జరిగిందని ఆరోపణలు సైతం వెల్లువెత్తాయి. ఇక ఈ కేసులో సంజయ్ రాయ్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంకోవైపు ఈ కేసును సీబీఐ దర్యాప్తునకు కోల్‌కతా హైకోర్టు అప్పగించింది. ఈ కేసుకు సంబంధించి.. ఆసుపత్రిలోని పలువురు వైద్యులకు సీబీఐ ఇప్పటికే నోటీసులు జారీ చేసింది.

Also Read: Varalakshmi Vratham 2024: వరలక్ష్మీ వ్రతం వేళ.. ఏ రంగు చీర కట్టుకోవాలంటే..

Read More National News and Latest Telugu News

Updated Date - Aug 15 , 2024 | 08:06 PM