Share News

Sandeep Ghosh: అనాథ శవాలను అమ్మేశాడు..

ABN , Publish Date - Aug 22 , 2024 | 05:26 AM

ట్రైనీ డాక్టర్‌పై హత్యాచార ఘటన వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ప్రిన్సిపాల్‌ సందీప్‌ ఘోష్‌కు సంబంధించి సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి.

Sandeep Ghosh: అనాథ శవాలను అమ్మేశాడు..

కోల్‌కతా, న్యూఢిల్లీ, ఆగస్టు 21: ట్రైనీ డాక్టర్‌పై హత్యాచార ఘటన వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ప్రిన్సిపాల్‌ సందీప్‌ ఘోష్‌కు సంబంధించి సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. ఆయన శవాలను సైతం వదలకుండా అమ్ముకుని సొమ్ము చేసుకునే వారని ఆర్జీ కర్‌ కళాశాల మాజీ డిప్యూటీ సూపరిటెండెంట్‌ అఖ్తర్‌ అలీ తీవ్ర ఆరోపణలు చేశారు.


ఘోష్‌ అనాథ శవాలను అమ్మడంతో పాటు బయోమెడికల్‌ వ్యర్థాలను అక్రమంగా బంగ్లాదేశ్‌కు రవాణా చేసేవాడని ఆయన ఓ జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఆస్పత్రి, కళాశాలకు సంబంధించిన ఏ పని చేయడానికైనా డబ్బులు వసూలు చేసేవారన్నారు. పరీక్షల్లో పాస్‌ చేసేందుకు విద్యార్థుల నుంచి డబ్బులు తీసుకొనేవారని చెప్పారు.


కాలేజీ ఆస్తులను అనుమతులు లేకుండా లీజ్‌కు ఇచ్చారని పేర్కొన్నారు. ఘోష్‌ అక్రమాల మీద రాష్ట్ర విజిలెన్స్‌ కమిషన్‌ను అప్పట్లో తాను అప్రమత్తం చేశానని, ఆయనపై వేసిన విచారణ కమిటీలో సభ్యుడిగా ఉన్నానని, దర్యాప్తులో ఆయన తప్పు చేసినట్లు తేలిన్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు. ఘోష్‌ అక్రమాలపై తాను నివేదిక ఇస్తే అదే రోజు తనను ఆ కాలేజీ నుంచి ట్రాన్స్‌ఫర్‌ చేశారని అలీ ఆవేదన వ్యక్తం చేశారు.

Updated Date - Aug 22 , 2024 | 05:26 AM