Share News

Rouse Avenue Court Orders : కవిత కస్టడీ 20 వరకు పొడిగింపు

ABN , Publish Date - May 15 , 2024 | 05:04 AM

ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత జ్యూడీషియల్‌ కస్టడీని ఈ నెల 20 వరకు పొడిగిస్తూ రౌస్‌ అవెన్యూ కోర్టు ఆదేశాలు ఇచ్చింది.

Rouse Avenue Court Orders : కవిత కస్టడీ 20 వరకు పొడిగింపు

న్యూఢిల్లీ, మే 14 (ఆంధ్రజ్యోతి): ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత జ్యూడీషియల్‌ కస్టడీని ఈ నెల 20 వరకు పొడిగిస్తూ రౌస్‌ అవెన్యూ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. గతంలో విధించిన కస్టడీ గడువు మంగళవారం ముగియడంతో ఆమెను వర్చువల్‌ విధానంలో ప్రత్యేక కోర్టు ముందు హాజరుపరిచారు.

ఇరువైపులా వాదనలు విన్న జడ్జి కస్టడీని ఈ నెల 20 వరకు పొడిగించారు. కవితపై శుక్రవారం దాఖలు చేసిన అనుబంధ చార్జ్‌షీట్‌ అంశాన్ని ఈడీ న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. 8వేల పేజీలతో చార్జ్‌షీట్‌ను దాఖలు చేసినట్లు తెలిపారు. దీన్ని ఈ నెల 20న పరిశీలిస్తామని జడ్జి చెప్పారు.

Updated Date - May 15 , 2024 | 05:04 AM