IPS officers: 10 మంది ఐపీఎస్ అధికారులకు డీఐజీలుగా పదోన్నతి
ABN , Publish Date - Jan 02 , 2024 | 01:20 PM
డీఐజీ(DIG)లుగా పదోన్నతి కల్పిస్తూ 10 మంది ఐపీఎస్ అధికారులకు(IPS officers) రాష్ట్రప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. పీఆర్ వెన్మది, పి.అరవిందన్, వి.విక్రమన్, సరోజ్కుమార్ ఠాగూర్, డి.మహేష్ కుమార్, ఎన్.దేవరాణి, ఈఎస్ ఉమ, ఆర్. తిరునావుక్కరసు, ఆర్.జయంతి, జి.రామర్లకు పదోన్నతులు పొందారు.
పెరంబూర్(చెన్నై): డీఐజీ(DIG)లుగా పదోన్నతి కల్పిస్తూ 10 మంది ఐపీఎస్ అధికారులకు(IPS officers) రాష్ట్రప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. పీఆర్ వెన్మది, పి.అరవిందన్, వి.విక్రమన్, సరోజ్కుమార్ ఠాగూర్, డి.మహేష్ కుమార్, ఎన్.దేవరాణి, ఈఎస్ ఉమ, ఆర్. తిరునావుక్కరసు, ఆర్.జయంతి, జి.రామర్లకు పదోన్నతులు పొందారు. అలాగే, ఆనందకుమార్ సోమణి, ఆర్.తమిళ్చంద్రన్ తదితరులు ఏడీజీపీలుగా పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక ప్రస్తుతం డీఐజీలుగా పనిచేస్తున్న జయశ్రీ, చాముండేశ్వరి, లక్ష్మి, రాజేశ్వరి, రాజేంద్రన్, ముత్తుస్వామి, మయిల్వాహనన్ తదితరులు ఐజీగా పదోన్నతులు పొందారు.