Share News

Jammu and Kashmir: ఘోర బస్సు ప్రమాదం.. ముగ్గురు బీఎస్ఎఫ్ జవాన్లు మృతి

ABN , Publish Date - Sep 20 , 2024 | 08:09 PM

జమ్మూకశ్మీర్‌ లోని బుద్గాం జిల్లాలో శుక్రవారంనాడు ఘోర బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. పుల్వామా నుంచి బుద్గాం వెళ్తున్న బస్సు ప్రమాదవశాత్తూ కింద నున్న లోయలోకి జారిపడటంతో అందులో ప్రయాణిస్తున్న ముగ్గురు బీఎస్‌ఎఫ్ జవాన్లు మృతి చెందారు.

Jammu and Kashmir: ఘోర బస్సు ప్రమాదం.. ముగ్గురు బీఎస్ఎఫ్ జవాన్లు మృతి

బుద్గాం: జమ్మూకశ్మీర్‌ (Jammu and Kashmir)లోని బుద్గాం జిల్లాలో శుక్రవారంనాడు ఘోర బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. పుల్వామా నుంచి బుద్గాం వెళ్తున్న బస్సు ప్రమాదవశాత్తూ కింద నున్న లోయలోకి జారిపడటంతో అందులో ప్రయాణిస్తున్న ముగ్గురు సరిహద్దు భద్రతా దళ (బీఎస్ఎఫ్) జవాన్లు మృతి చెందారు. మరో 26 మంది గాయపడ్డారు. రెండో విడత అసెంబ్లీ ఎన్నికల సన్నాహకాల్లో భాగంగా బస్సులో వీరంతా వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్టు తెలిసింది. సమాచారం తెలిసిన వెంటనే రెస్క్యూ బృందాలు వెంటనే రంగంలోకి దిగాయి. క్షతగాత్రులను హుటాహుటిన ఆసుపత్రికి తరలిస్తున్నారు.


Read MoreNational News and Latest Telugu News

Also Read:CM Mamata Banerjee: పశ్చిమ బెంగాల్‌కు వరద పోటు.. జార్ఖండ్

Updated Date - Sep 20 , 2024 | 08:46 PM