Share News

Lok Sabha Elections 2024: లోక్‌సభ ఎన్నికలు సమాప్తం.. ముగిసిన ఏడో దశ పోలింగ్

ABN , Publish Date - Jun 01 , 2024 | 06:21 PM

2024 సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఏడో దశ పోలింగ్ ముగిసింది. జూన్ 1వ తేదీన దేశవ్యాప్తంగా 57 స్థానాలకు జరిగిన పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. దీంతో.. ఏప్రిల్ 19వ తేదీ నుంచి..

Lok Sabha Elections 2024: లోక్‌సభ ఎన్నికలు సమాప్తం.. ముగిసిన ఏడో దశ పోలింగ్

లోక్‌సభ ఎన్నికలు-2024లో (Lok Sabha Elections 2024) భాగంగా.. ఏడో దశ పోలింగ్ ముగిసింది. జూన్ 1న (శనివారం) ఏడు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతం పరిధిలోని 57 స్థానాలకు జరిగిన పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. దీంతో.. ఏప్రిల్ 19వ తేదీ నుంచి మొదలుకొని జూన్ 1వ తేదీ వరకు 44 రోజులపాటు సుదీర్ఘంగా సాగిన సార్వత్రిక ఎన్నికల సమరం ముగిసింది. జూన్ 4వ తేదీన లోక్‌సభతో పాటు కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ (ఏపీ, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఒడిశా) ఫలితాలు రానున్నాయి.

Updated Date - Jun 01 , 2024 | 06:28 PM