Home » Lok Sabha Polls 2024
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్లో 175 శాసనసభ స్థానాలతో పాటు 25 పార్లమెంట్ స్థానాలకు మరికొద్ది గంటల్లో పోలింగ్ జరగనుంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమవుతుంది. ఓటు వేసేందుకు ఇప్పటికే ఓటరు స్లిప్, ఐడి కార్డు అందరూ రెడీ చేసుకుని ఉంటారు. ఉదయం 7వ గంట కొట్టగానే పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓట్లు వేస్తూ ఉంటారు. ఎన్నికలు అంటేనే ఎన్నో అనుమానాలు. ఈ క్రమంలో సాధారణ ఓటర్లు అయితే పోలింగ్ బూత్కి వెళ్లి ఈవీఎంలో బటన్ నొక్కి ఓటు వేసి వస్తారు.
ఎన్నికలంటే వెంటనే గుర్తొచ్చేది చేతి వేలిపై వేసే సిరా గుర్తునే.. ఎన్నో సిరాలున్నా.. ఎన్నికల సమయంలో ఉపయోగించే సిరా వెరీ స్పెషల్. ఎందుకంటే ఓసారి సిరా గుర్తు వేస్తే అది వెంటనే చెరిగిపోదు. కనీసం వారం రోజుల వరకు ఆ గుర్తు చేతివేలిపై ఉంటుంది. అలాఅని పెద్దగా కూడా వేయరు. జస్ట్ ఓ చుక్కఅంటిస్తారు. చేతి వేలిపై సిరా చుక్క అంటించగానే అది వెంటనే అతుక్కుపోతుంది. దొంగ ఓట్లను నివారించడానికి ఈసిరా వాడుతుంటారు.
దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు దశల వారీగా జరుగుతున్నా.. ఇప్పటికీ ‘ఇండియా’ కూటమి ప్రధాని అభ్యర్థి ఎవరనేది క్లారిటీ రాలేదు. కొందరు బడా నేతల పేర్లు చక్కర్లు కొడుతున్నాయి కానీ.. కూటమి మాత్రం ఇంతవరకూ..
దేశంలో ఓటు హక్కు ఉన్న ప్రతి ఓటరు పేరు మీద ఎన్నికల సంఘం ఓటరు స్లిప్ ముద్రిస్తుంది. పోలింగ్ సమయానికి ఓ వారం రోజుల ముందే బూత్ లెవల్ అధికారులు (బీఎల్వో)లద్వారా ఓటర్లు స్లిప్లు పంపిణీ చేస్తారు. ఈ ఓటరు స్లిప్ ఉండటం ద్వారా ఓటరు ఏ బూత్లో ఓటు వేయాలో.. ఓటర్ల జాబితాలో క్రమ సంఖ్య ఎంత అనేది స్పష్టంగా ఉంటుంది. దీంతో పోలింగ్ స్పీడ్గా జరుగుతుంది.
ఎలాగైతే సినిమా హీరోలకు వీరాభిమానులు ఉంటారో.. అలాగే రాజకీయ నాయకులను అభిమానించే వ్యక్తులూ ఉంటారు. తమ నాయకుల కోసం వాళ్లు ఏం చేయడానికైనా సిద్ధపడతారు. తమకు రూపాయి అందకపోయినా సరే..
ఎన్టీఆర్ జిల్లాలో ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్ డిల్లీరావు(Dilli Rao) తెలిపారు. జిల్లా కేంద్రంలో ఆయన ఆదివారం మాట్లాడుతూ.. ఎన్నికల పర్యవేక్షణ నిమిత్తం రాష్ట్ర ఎన్నికల పరిశీలన అధికారి మోహన్ వచ్చారని చెప్పారు.
ప్రధాని మోదీ(PM Modi) మే 14న ఉత్తరప్రదేశ్లోని వారణాసి(Varanasi) లోక్ సభ స్థానానికి నామినేషన్ సమర్పించనున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి ఎన్డీఏ కూటమిలోని ప్రధాని పార్టీల నేతలను మోదీ ఆహ్వానించారు.
Telangana: తెలంగాణలో ఎన్నికల ఏర్పాట్లు పూర్తి చేశామని డీజీపీ రవి గుప్త తెలిపారు. ఆదివారం ఏబీఎన్ - ఆంధ్రజ్యోతితో డీజీపీ రవి గుప్త మాట్లాడుతూ.. ప్రజలందరూ నిర్భయంగా తమ ఓటు హక్కును వినిగించుకోవాలని కోరారు. ఎక్కడా కూడా ఇలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. 73,414 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశామని చెప్పారు. 500 తెలంగాణ స్పెషల్ ఫోర్స్ విభాగాలు సహా.. 164 సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్సెస్తో భద్రతా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.
Andhrapradesh: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఓటేసేందుకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం టీఎస్ఆర్టీసీ యాజమాన్యం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసిందని టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్కు ఇప్పటి వరకు 590 స్పెషల్ బస్సులను ఏర్పాటు చేశామన్నారు.
రేపే ఎన్నికల పండుగ. సామాన్యులతో పాటు సెలబ్రిటీలంతా ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఎవరెక్కడ వినియోగించుకోనున్నారంటే.. ఓబుల్రెడ్డి స్కూల్లో జూనియర్ ఎన్టీఆర్, ప్రణతి ఓటు హక్కును వినియోగించుకున్నారు. బీఎస్ఎన్ఎల్ సెంటర్ జూబ్లీహిల్స్లో అల్లు అర్జున్, స్నేహారెడ్డి, అల్లు అరవింద్, అల్లు శిరీష్ .. జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్లో మహేశ్బాబు, నమ్రత , మంచు మోహన్బాబు, విష్ణు, లక్ష్మి, మనోజ్, విజయ దేవరకొండ, ఆనంద్ దేవరకొండ, శ్రీకాంత్, జీవిత, రాజశేఖర్ ఓటు హక్కును వినియోగించుకున్నారు.