Share News

MLA: నేను పరారీ కాలేదు.. నాకు నోటీసులు రాలేదు..

ABN , Publish Date - Jul 16 , 2024 | 01:00 PM

వాల్మీకి అభివృద్ధి కార్పొరేషన్‌ అధ్యక్షుడు, రాయచూరు గ్రామీణ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే బసనగౌడ దద్దల్‌(Raichur Rural Congress MLA Basana Gowda Daddal) మూడు రోజులుగా అజ్ఞాతంలో ఉన్నారనే ప్రచారానికి స్వయంగా ఆయనే తెరదించారు.

MLA: నేను పరారీ కాలేదు.. నాకు నోటీసులు రాలేదు..

- రాయచూరు గ్రామీణ ఎమ్మెల్యే బసనగౌడ దద్దల్‌

బెంగళూరు: వాల్మీకి అభివృద్ధి కార్పొరేషన్‌ అధ్యక్షుడు, రాయచూరు గ్రామీణ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే బసనగౌడ దద్దల్‌(Raichur Rural Congress MLA Basana Gowda Daddal) మూడు రోజులుగా అజ్ఞాతంలో ఉన్నారనే ప్రచారానికి స్వయంగా ఆయనే తెరదించారు. శాసనసభ సమావేశాలలో పాల్గొనేందుకు విధానసౌధకు వచ్చారు. ఇదే సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘నేను పరారీ కాలేదు... నాకు నోటీసులు రాలేదు’ అని స్పష్టం చేశారు. తాను ఊర్లోనే ఉన్నానని తెలిపారు. వాల్మీకి అభివృద్ధి కార్పొరేషన్‌ అవినీతిలో మాజీ మంత్రి నాగేంద్ర(Former minister Nagendra)ను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. దీంతో కార్పొరేషన్‌ చైర్మన్‌గా ఉన్న ఎమ్మెల్యే దద్దల్‌ కనిపించలేదని ప్రచారం సాగింది.

ఇదికూడా చదవండి: ఒకే కుటుంబంలో ముగ్గురి హత్య..


ఇదికూడా చదవండి: కాల్పుల కలకలం.. పోలీసులపై గొడ్డలి, రాళ్లతో యువకుల దాడి

ఇదికూడా చదవండి: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - Jul 16 , 2024 | 01:00 PM