Share News

Farmers Protest: చర్చల్లో రైతుల డిమాండ్లపై రాని స్పష్టత..

ABN , Publish Date - Feb 16 , 2024 | 08:44 AM

చండీగఢ్‌: పంటల కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని డిమాండు చేస్తూ ఢిల్లీ శివారుల్లో ఒకవైపు అన్నదాతలు ఆందోళన కొనసాగుతుండగా చండీగఢ్‌లో గురువారం ముగ్గురు కేంద్రమంత్రులు రైతు నాయకులతో చర్చలు జరిపారు. ఆందోళన మొదలయిన తరువాత ఇవి మూడో దఫా చర్చలు కావడం విశేషం. గురువారం అర్ధరాత్రి వరకు చర్చలు కొనసాగాయి.

Farmers Protest: చర్చల్లో రైతుల డిమాండ్లపై రాని స్పష్టత..

చండీగఢ్‌: పంటల కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని డిమాండు చేస్తూ ఢిల్లీ శివారుల్లో ఒకవైపు అన్నదాతలు ఆందోళన కొనసాగుతుండగా చండీగఢ్‌లో గురువారం ముగ్గురు కేంద్రమంత్రులు రైతు నాయకులతో చర్చలు జరిపారు. ఆందోళన మొదలయిన తరువాత ఇవి మూడో దఫా చర్చలు కావడం విశేషం. గురువారం అర్ధరాత్రి వరకు చర్చలు కొనసాగాయి.

రైతు సంఘాలతో కేంద్ర మంత్రులు అర్జున్ ముండా, పీయూష్ గోయల్, నిత్యానంద్ రాయ్. నిన్న (గురువారం) అర్ధరాత్రి వరకు చర్చలు జరిపారు. అయితే రైతుల డిమాండ్లపై స్పష్టత రాలేదు. కాగా శుక్రవారం భారత్ బంద్‌కు రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. శాంతియుతంగా బంద్ కొనసాగనుంది.

కేంద్ర మంత్రి అర్జున్ ముండా మాట్లాడుతూ.. ప్రభుత్వం, రైతు సంఘాల మధ్య చాలా సానుకూల వాతావరణంలో చర్చలు జరిగాయన్నారు. రైతు సంఘం హైలైట్ చేసిన అంశాలపై దృష్టి సారించి, తాము ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ఆదివారం సాయంత్రం 6 గంటలకు మరొసారి రైతు సంఘాలతో కేంద్రం చర్చలు జరపనుందని, శాంతియుతంగా పరిష్కారం కనుగొంటామని అర్జున్ ముండా తెలిపారు.

రైతు నాయకుడు జగ్జిత్ సింగ్ దల్లేవాల్ మాట్లాడుతూ..రైతుల నిరసన శాంతియుతంగా కొనసాగుతోందని, ఆదివారం వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి హామీ రాకపోతే ఆందోళన మళ్ళీ కొనసాగిస్తామని స్పష్టం చేశారు. అప్పటివరకు సరిహద్దుల్లోనే వేచి చూస్తామని జగ్జిత్ సింగ్ దల్లేవాల్ అన్నారు.

కాగా పంటలకు ఎంఎస్‌పీ చట్టం, రుణమాఫీ సహా తమ వివిధ డిమాండ్ల కోసం కేంద్రంపై ఒత్తిడి తేవడానికి సంయుక్త కిసాన్ మోర్చా (నాన్ పొలిటికల్), కిసాన్ మజ్దూర్ మోర్చా 'ఢిల్లీ చలో' ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్నాయి. ఆ క్రమంలో హర్యానా, పంజాబ్‌ సరిహద్దుల్లో చేస్తున్న నిరసనలు మరింత వ్యాపించాయి. దీంతో వారిని అదుపు చేసేందుకు పోలీసులు ప్రయత్నించగా ఆయా ప్రాంతాలు ఉద్రిక్తంగా మారాయి. ఈ నేపథ్యంలో హర్యానా ప్రభుత్వం 7 జిల్లాల్లో మొబైల్ ఇంటర్నెట్ సేవలపై విధించిన ఆంక్షలను ఫిబ్రవరి 17 వరకు పొడిగించింది.

Updated Date - Feb 16 , 2024 | 08:44 AM