Home » Protest
పోలీసుల అనుమతి లేనప్పటికీ వందలాది మంది నిరసనకారులు సిల్చార్ పట్టణంలోని బెరెంగా ప్రాంతంలో రోడ్లపైకి వచ్చి ఆందోళనలకు దిగారు. రోడ్లు దిగ్బంధం చేయడంతో పోలీసులు వారికి నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. నల్లజెండాలు ధరించిన నిరసనకారులు బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
వక్ఫ్ బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ మంగళవారంనాడు జాంగిపూర్ పీడబ్ల్యూబీ మైదానం నుంచి బయలు దేరిన నిరసన ప్రదర్శన హింసాత్మకంగా మారింది. నేషనల్ హైవేను దిగ్బంధం చేసేందుకు జాంగ్పూర్ నుంచి ఉదంపూర్ వెళ్తుండగా పోలీసులు వారిని అడ్డుకున్నారు.
బీజేపీ ఎమ్మెల్యేలు హైదర్గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి బయలుదేరి.. హెచ్సీయూ భూముల వద్దకు చేరుకుని అక్కడ బాధిత విద్యార్థులతోపాటుగా హెచ్సీయూ యాజమాన్యం, ప్రభుత్వ పెద్దలతో మాట్లాడేందుకు సమాయత్తమవుతున్న నేపథ్యంలో ఇందుకు అనుమతి లేదంటూ పోలీసులు బీజేపీ నేతలను అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. బీజేపీ ముఖ్యనేతలు బయటకు రాకుండా పోలీసులు హౌస్ అరెస్టు చేశారు.
తన వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడనే కక్ష్యతో 10 రోజుల పాటు రెక్కి చేసిన తర్వాత ఎలక్ట్రిషన్ దస్తగిరి అనే వ్యక్తి న్యాయవాదిని హత్య చేశాడు. ఈ కేసులో పోలీసుల విచారణ కొనసాగుతోంది. మరోవైపు మంగళవారం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులు తమ విధులను బహిష్కరించి నిరసలు తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే ..
హైదరాబాద్ క్యాబ్ డ్రైవర్లు మార్చి 24 నుంచి మరో నిరసనకు రెడీ అయ్యారు. ఈ క్రమంలో నో ఏసీ క్యాంపెయిన్ పేరుతో కార్లలో కస్టమర్లకు ఏసీలను వేయకుండా రైడ్లను నిర్వహిస్తారు. అయితే దీనికి గల కారణాలు ఏంటనే విషయాలను ఇప్పుడు చూద్దాం.
ఇఫ్తార్ విందుతో దుశ్చర్యలకు పాల్పడిన వారిపై కళాశాల యాజమాన్యం చర్యలు తీసుకోవాలని బజ్రంగదళ్ కార్యకర్తలు డిమాండ్ చేశారు. మూడు రోజుల్లోపు చర్యలు తీసుకోకుండా ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ఖాళీ ఖజానాను తమకు అప్పగించారంటూ సీఎం రేఖా గుప్తా చెప్పడంపై అతిషి మాట్లాడుతూ, పదేళ్ల తర్వాత ఆర్థికంగా బలంగా ఉన్న ప్రభుత్వాన్ని బీజేపీకి తాము అప్పగించామన్నారు. సాకుల కోసం వెతుక్కోకుండా ఇచ్చిన వాగ్దానాలను బీజేపీ నిలబెట్టుకోవాలని సూచించారు.
కేంద్ర బడ్జెట్ తెలంగాణ హక్కులను, ఆకాంక్షలను కాలరాసిందని రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర స్థాయిలో ఆక్షేపించింది. రాష్ట్ర సమస్యలు, అభివృద్ధి అంశాలను పట్టించుకోలేదని విమర్శించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంపై వివక్షకు నిరసనగా ఆదివారం రాష్ట్ర కాంగ్రెస్ భారీ ధర్నా చేయనుంది. ఈ నిరసన కార్యక్రమంలో పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొనాలని టీపీసీసీ చీఫ్ పిలుపిచ్చారు.
K. Rammohan Naidu: ప్రధాని నరేంద్ర మోదీ.. విశాఖపట్నం పర్యటనపై కేంద్ర పౌర విమానాయాన శాఖ మంత్రి కే.రామ్మోహన్ నాయుడు స్పందించారు. విశాఖపట్నానికి త్వరలో ఐటీ సంస్థలు వస్తు్న్నాయని తెలిపారు.
GHMC: ప్రజలకు ఉచితాల పేరుతో పలు పథకాలు ప్రవేశపెట్టి.. ప్రభుత్వాలు పులి మీద స్వారీ చేస్తున్నాయి. ఆ క్రమంలో ప్రభుత్వ ఖజానాలో నిధులు నిండుకొంటున్నాయి.