Share News

PM Modi : ‘హర్‌ ఘర్‌ తిరంగా’ కలకాలం గుర్తుండిపోవాలి

ABN , Publish Date - Aug 10 , 2024 | 04:24 AM

స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని హర్‌ ఘర్‌ తిరంగా(ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం) వేడుకలను కలకాలం గుర్తుండిపోయేలా ఘనంగా నిర్వహించుకోవాలని ప్రధాని మోదీ ప్రజలకు పిలుపునిచ్చారు.

PM Modi  : ‘హర్‌ ఘర్‌ తిరంగా’ కలకాలం గుర్తుండిపోవాలి

న్యూఢిల్లీ, ఆగస్టు 9: స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని హర్‌ ఘర్‌ తిరంగా(ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం) వేడుకలను కలకాలం గుర్తుండిపోయేలా ఘనంగా నిర్వహించుకోవాలని ప్రధాని మోదీ ప్రజలకు పిలుపునిచ్చారు. దేశ ప్రజలంతా తమ ఇళ్లపై జాతీయ జెండాలను ఎగురవేయాలన్నారు.

శుక్రవారం మోదీ త్రివర్ణ పతాకాన్ని తన ఎక్స్‌ ఖాతా ప్రొఫైల్‌ ఫొటోగా పెట్టుకున్నారు. ప్రజలు కూడా అలాగే చేయాలని, జాతీయ జెండాలతో సెల్ఫీలు దిగి సామాజిక మాధ్యమాల్లో పంచుకోవాలని పిలుపునిచ్చారు. హర్‌ ఘర్‌ తిరంగా వేడుకల్లో భాగంగా 13న ఎంపీలు ఢిల్లీలో త్రివర్ణ పతాకాలతో బైక్‌ ర్యాలీ నిర్వహిస్తారు.

Updated Date - Aug 10 , 2024 | 04:24 AM