Tamilnadu: తమిళనాడు తొలి బీజేపీ ఎమ్మెల్యే కన్నుమూత... మోదీ సంతాపం
ABN , Publish Date - May 08 , 2024 | 09:28 PM
తమిళనాడు బీజేపీ మాజీ ఎమ్మెల్యే సి.వేలాయుధం బుధవారంనాడు కన్నుమూశారు. ఆయన వయస్సు 73 సంవత్సరాలు. తమిళనాడు అసెంబ్లీకి 1996లో బీజేపీ టిక్కెట్పై గెలిచిన తొలి ఎమ్మెల్యే కూడా ఆయనే కావడం విశేషం.వేలాయుధం మృతికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఒక ట్వీట్లో సంతాపం తెలిపారు.
చెన్నై: తమిళనాడు బీజేపీ మాజీ ఎమ్మెల్యే సి.వేలాయుధం (C.Velayutham) బుధవారంనాడు కన్నుమూశారు. ఆయన వయస్సు 73 సంవత్సరాలు. తమిళనాడు అసెంబ్లీకి బీజేపీ టిక్కెట్పై గెలిచిన తొలి ఎమ్మెల్యే కూడా ఆయనే కావడం విశేషం. 1996లో పద్మనాభపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేసి గెలిచారు. వేలాయుధం మృతికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఒక ట్వీట్లో సంతాపం తెలిపారు. పార్టీకి ఆయన అందించిన సేవలను గుర్తుచేసుకున్నారు. తమిళనాడులో పార్టీకి పునాది వేయడంతో పాటు పార్టీ నుంచి గెలిచిన తొలి ఎమ్మెల్యే ఘనత ఆయనకు దక్కుతుందని, వేలాయుధం వంటి నేతలు తమిళనాడులో పార్టీకి జవజీవాలు పోసి బీజేపీ అభివృద్ధి ఎజెండాను ప్రజల్లోకి తీసుకువెళ్లారని కొనియాడారు. పేదలు, అణగారిన వర్గాల ప్రజల అభ్యున్నతికి వేలాయుధం విశేష కృషి చేశారని అన్నారు. వేలాయుధం కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. ఆయన ఆత్మకు శాంతికలగాలని కోరుకుంటున్నానని అన్నారు.