Share News

National :సుప్రీంకు ‘పోస్టల్‌ బ్యాలెట్‌’ పంచాయితీ!

ABN , Publish Date - Jun 03 , 2024 | 06:10 AM

ఆంధ్రప్రదేశ్‌లో పోస్టల్‌ బ్యాలెట్ల పంచాయితీ సుప్రీంకోర్టుకు చేరింది. పోస్టల్‌ బ్యాలెట్‌ డిక్లరేషన్‌కు సంబంధించి ఫాం-13ఏపై అటెస్టింగ్‌ అధికారి సంతకం ఉండి, హోదా వివరాలు లేకపోయినా బ్యాలెట్‌ చెల్లుబాటవుతుందని కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) ఇచ్చిన ఉత్తర్వుల్లో జోక్యం చేసుకునేందుకు హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ నిరాకరించడాన్ని వైసీపీ సర్వోన్నత న్యాయస్థానంలో సవాల్‌ చేసింది.

National :సుప్రీంకు ‘పోస్టల్‌ బ్యాలెట్‌’ పంచాయితీ!

  • హైకోర్టు తీర్పును సవాల్‌ చేసిన వైసీపీ

  • తన వాదనా వినాలని టీడీపీ నేత వెలగపూడి కేవియట్‌

న్యూఢిల్లీ/విశాఖపట్నం, జూన్‌ 2 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌లో పోస్టల్‌ బ్యాలెట్ల పంచాయితీ సుప్రీంకోర్టుకు చేరింది. పోస్టల్‌ బ్యాలెట్‌ డిక్లరేషన్‌కు సంబంధించి ఫాం-13ఏపై అటెస్టింగ్‌ అధికారి సంతకం ఉండి, హోదా వివరాలు లేకపోయినా బ్యాలెట్‌ చెల్లుబాటవుతుందని కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) ఇచ్చిన ఉత్తర్వుల్లో జోక్యం చేసుకునేందుకు హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ నిరాకరించడాన్ని వైసీపీ సర్వోన్నత న్యాయస్థానంలో సవాల్‌ చేసింది.

ఈ నేపథ్యంలో టీడీపీ సీనియర్‌ నేత, విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు కూడా సుప్రీంకోర్టులో కేవియట్‌ దాఖలు చేశారు. కోర్టు వైసీపీ పిటిషన్‌పై వాదనలు వింటే.. తన వాదన కూడా విన్న తర్వాతే నిర్ణయం తీసుకోవాలని ఆయన అభ్యర్థించారు. వెలగపూడి తరఫున న్యాయవాది గుంటూరు ప్రభాకర్‌ ఈ కేవియట్‌ వేశారు.

Updated Date - Jun 03 , 2024 | 08:24 AM