Share News

NDA Alliance: అందరి చూపు వారివైపే.. కింగ్ మేకర్లుగా బాబు, నితీశ్

ABN , Publish Date - Jun 05 , 2024 | 08:17 AM

సార్వత్రిక సమరం ముగిసింది అనుకుంటున్న వేళ మరో సమరం తెరపైకి వచ్చింది. అదే.. బీజేపీ సొంతంగా మెజారిటీ మార్క్ చేరకపోవడం. ప్రధాని మోదీ చరిష్మా మరోసారి మ్యాజిక్ చేస్తుందనుకున్న బీజేపీ నేతలకు ఇది మింగుడుపడటం లేదు.

NDA Alliance: అందరి చూపు వారివైపే.. కింగ్ మేకర్లుగా బాబు, నితీశ్

ఢిల్లీ: సార్వత్రిక సమరం ముగిసింది అనుకుంటున్న వేళ మరో సమరం తెరపైకి వచ్చింది. అదే.. బీజేపీ సొంతంగా మెజారిటీ మార్క్ చేరకపోవడం. ప్రధాని మోదీ చరిష్మా మరోసారి మ్యాజిక్ చేస్తుందనుకున్న బీజేపీ నేతలకు ఇది మింగుడుపడటం లేదు. దీంతో మిత్రపక్షాల మద్దతు ఇప్పుడు కీలకంగా మారింది. ఈ సందర్భంగా ఢిల్లీలో బుధవారం ఎన్డీయే పక్షాలు భేటీ కానున్నాయి.

బీజేపీ సొంతంగా మ్యాజిక్ పిగర్ అయిన 272 సీట్లు సాధించలేకపోవడంతో మిత్రపక్షాల మద్దతుతోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే టీడీపీకి 16, జేడీ యూకు 12 సీట్లు రావడంతో సమావేశంలో టీడీపీ అధి నేత చంద్రబాబు, టీడీయూ చీఫ్ నితీశ్ కీలకం కానున్నారు. ఇప్పటికే బాబుకు ప్రధాని మోదీ పోన్ చేసి మాట్లాడారు.


ఈనెల 8న ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో ఆ కార్యక్రమానికి తాను హాజరవుతానని బాబుకు మోదీ చెప్పారు. కాగా సాధారణ మెజారిటీకి ఇండియా కూటమి 10 సీట్ల దూరంలో నిలిచిపోయిన నేపథ్యంలో మంగళవారం బాబు, నితీశ్ కు ఎన్సీపీ చీఫ్ శరద్ పవర్ ఫోన్ చేసి మాట్లాడినట్లుగా వార్త లొచ్చాయి. ఈ వార్త లను పవార్ ఖండించారు. తాను బాబుతో గానీ, నితీశ్‌తో గానీ మాట్లాడలేదని చెప్పారు.

For Latest News and National News Click Here

Updated Date - Jun 05 , 2024 | 08:17 AM