తిరుమల శ్రీవారిని దర్శించుకున్న లోకేష్ కుటుంబం..
ABN, Publish Date - Mar 22 , 2024 | 11:45 AM
శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తనను కలిసిన పార్టీ నాయకులతో ఆప్యాయంగా మాట్లాడారు. తిరుమలలోని గాయత్రి సదన్ అతిథిగృహం వద్దకు బుధవారం రాత్రి చేరుకున్న ఆయన అక్కడున్న కార్యకర్తలతో మాట్లాడారు. దాదాపు 15 నిమిషాలు బయటే నిలబడి కార్యకర్తలతో ఫొటోలు దిగారు. గురువారం కూడా శ్రీవారి దర్శనానంతరం తనను చూసేందుకు వచ్చిన నాయకులతో, కార్యకర్తలతో కొంతసేపు మాట్లాడారు. ‘ఎలా ఉన్నారు, మంచి రోజులు వస్తాయి, ధైర్యంగా పనిచేయండి’ అని లోకేష్ సూచించారు.
Updated at - Mar 25 , 2024 | 03:36 PM