Lokesh: సింహాద్రి అప్పన్న సన్నిధిలో మంత్రి లోకేష్

ABN, Publish Date - Sep 26 , 2024 | 10:36 AM

విశాఖపట్నం: సింహాచలంలో వేంచేసి ఉన్న శ్రీవరాహ లక్ష్మీ నరసింహస్వామి వారిని రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ గురువారం ఉదయం దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న లోకేష్‌కు ఆలయ ప్రధాన అర్చకులు, అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం స్వామివారి అంతరాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేదపండితులు లోకేష్‌కు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.

Updated at - Sep 26 , 2024 | 10:36 AM