Bhuvaneswari: ప్రాణం ఉన్నంతవరకు కార్యకర్తలకు అండగా ఉంటాం..
ABN, Publish Date - Feb 15 , 2024 | 12:50 PM
ధర్మవరం: ప్రాణం ఉన్నంతవరకు టీడీపీ కార్యకర్తలకు అండగా ఉంటామని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సతీమణి నారా భువనేశ్వరి అన్నారు. ‘నిజం గెలవాలి’ కార్యక్రమంలో భాగంగా ఆమె కనగానపల్లి, రామగిరి మండలాల్లో బుధవారం పర్యటించారు. చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో తీవ్ర మనోవేదనతో ప్రాణాలు కోల్పోయిన కార్యకర్తల కుటుంబాలను పరామర్శించారు. వేపకుంట గ్రామ టీడీపీ కార్యకర్త బెస్త నారాయణ కుటుంబాన్ని ఓదార్చారు. బాధిత కుటుంబానికి ఆమె రూ.3 లక్షల చెక్కును అందించారు. ధైర్యంగా ఉండాలని, తాము అండగా ఉంటామని భరోసా కల్పించారు. ఈ సందర్బంగా చేనేత మహిళలతో ముఖాముఖి కార్యక్రమంలో భువనేశ్వరి పాల్గొన్నారు.
Updated at - Feb 15 , 2024 | 12:50 PM