Share News

TS News: మంచిర్యాలలో యువకుడి దారుణ హత్య

ABN , Publish Date - Feb 14 , 2024 | 10:49 AM

Telangana: జిల్లాలోని చెన్నూర్ మండలం కమ్మరపల్లిలో యువకుడి దారుణ హత్య కలకలం రేపుతోంది. మృతుడు పొన్నారం గ్రామానికి చెందిన రామగిరి మహేందర్‌గా గుర్తించారు.

TS News: మంచిర్యాలలో యువకుడి దారుణ హత్య

మంచిర్యాల, ఫిబ్రవరి 14: జిల్లాలోని చెన్నూర్ మండలం కమ్మరపల్లిలో యువకుడి దారుణ హత్య కలకలం రేపుతోంది. మృతుడు పొన్నారం గ్రామానికి చెందిన రామగిరి మహేందర్‌గా గుర్తించారు. వివాహేతర సంబంధం నేపథ్యంలో హత్య చేసి, దహనం చేసినట్లు తెలుస్తోంది. స్థానికుల సమాచారం మేరకు అక్కడకు చేరుకున్ని పోలీసులు... పాక్షికంగా కాలిన మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. గ్రామానికి చెందిన వివాహితతో మహేందర్‌కు సన్నిహిత సంబంధాలున్నట్టు పోలీసుల విచారణలో నిర్దారణ అయ్యింది.

Updated Date - Feb 14 , 2024 | 10:49 AM