Share News

బీజేపీ బలోపేతానికి కృషి చేయాలి

ABN , Publish Date - Sep 14 , 2024 | 11:01 PM

బీజేపీ బలోపేతానికి యువతతోపాటు ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని సీనియర్‌ నాయకుడు శ్యాంసుందర్‌రావు అన్నారు. శనివారం పట్టణంలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. నరేంద్ర మోదీ నాయకత్వాన్ని దేశ ప్రజలు విశ్వసించారని, అన్ని వర్గాల ప్రజలు యువత సభ్యత్వం తీసుకోవాలన్నారు.

 బీజేపీ బలోపేతానికి కృషి చేయాలి

బెల్లంపల్లి, సెప్టెంబరు 14 : బీజేపీ బలోపేతానికి యువతతోపాటు ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని సీనియర్‌ నాయకుడు శ్యాంసుందర్‌రావు అన్నారు. శనివారం పట్టణంలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. నరేంద్ర మోదీ నాయకత్వాన్ని దేశ ప్రజలు విశ్వసించారని, అన్ని వర్గాల ప్రజలు యువత సభ్యత్వం తీసుకోవాలన్నారు. పట్టణంలోని వ్యాపారులు బీజేపీ సభ్యత్వం తీసుకున్నారు. సభ్యత్వ నమోదు జిల్లా కన్వీనర్‌ ఎనగందుల కృష్ణమూర్తి, కోకన్వీనర్‌ శ్రీకృష్ణదేవరాయలు, మాజీ ఎమ్మెల్యే అమురాజుల శ్రీదేవి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొయ్యాల ఏమాజీ, జిల్లా ఉపాధ్యక్షుడు పులగం తిరుపతి, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు కోడి రమేష్‌, జిల్లా కార్యదర్శి గోవర్ధన్‌, అసెంబ్లీ కో కన్వీనర్‌ రాజులాల్‌ యాదవ్‌, మండల అధ్యక్షుడు రామన్న యాదవ్‌, బుడిమే విజయ్‌ పాల్గొన్నారు.

దేశ రక్షణ కోసం బీజేపీలో చేరండి

తాండూర్‌: దేశ రక్షణ, శ్రేయస్సు కోసం బీజేపీ పని చేస్తోందని, ప్రజలు అందరూ పార్టీలో చేరాలని సీనియర్‌ నాయకులు గోనె శ్యాంసుందర్‌ రావు పిలుపునిచ్చారు. శనివారం మండల కేంద్రంలో బీజేపీ సభ్యత్వ నమోదులో పాల్గొని మాట్లాడారు. ప్రజలు బీజేపీని విశ్వసించి నరేంద్ర మోదీని మూడు సార్లు ఎన్నుకున్నారని అన్నారు. మండల అధ్యక్షుడు దూడపాక భరత్‌ కుమార్‌, ఎనుగందుల కృష్ణమూర్తి, శ్రీకృష్ణదేవరాయులు, కొయ్యాల ఏమాజీ, అమురాజుల శ్రీదేవి, పులగం తిరుపతి, గోవర్ధన్‌, చిలువేరు శేషగిరి, పుట్ట కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 14 , 2024 | 11:01 PM