Share News

Adilabad: లోకారి వద్ద ప్రభుత్వ ఉపాధ్యాయుణ్ని హత్య చేసిన దుండగులు..

ABN , Publish Date - Jun 12 , 2024 | 05:21 PM

గాదిగూడ మండలం లోకారి(Lokari) వద్ద దారుణ ఘటన చోటు చేసుకుంది. గుర్తుతెలియని దుండగులు ప్రభుత్వ ఉపాధ్యాయుణ్ని (Government Teacher) హత్య చేయడంతో స్థానికంగా కలకలం రేగింది. కుటుంబకలహాల నేపథ్యంలో హత్య జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

Adilabad: లోకారి వద్ద ప్రభుత్వ ఉపాధ్యాయుణ్ని హత్య చేసిన దుండగులు..

ఆదిలాబాద్: గాదిగూడ మండలం లోకారి(Lokari) వద్ద దారుణ ఘటన చోటు చేసుకుంది. గుర్తుతెలియని దుండగులు ప్రభుత్వ ఉపాధ్యాయుణ్ని(Government Teacher) హత్య చేయడంతో స్థానికంగా కలకలం రేగింది. కుటుంబకలహాల నేపథ్యంలో హత్య జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.


అసలేం జరిగిందంటే..?

జైనథ్ మండలం కెనాల్ మేడిగూడ ప్రభుత్వ పాఠశాలలో గజేందర్ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వర్తిస్తున్నాడు. స్కూళ్లు బుధవారం పునర్ ప్రారంభం కావడంతో స్వగ్రామం నాగలకోయ నుంచి ద్విచక్రవాహనంపై బయలుదేరారు. నార్నూర్ మండలం అర్జుని- లోకారి వద్దకు రాగానే గుర్తుతెలియని దుండగులు అతణ్ని అడ్డగించి దాడి చేశారు. తీవ్రంగా గాయపరిచి బండరాళ్లతో తలపై మోదడంతో గజేందర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఆదిలాబాద్ శ్రీనగర్ కాలనీలో గజేందర్ నివాసం ఉంటున్నట్లు సమాచారం. కుటుంబకలహాల నేపథ్యంలో హత్య జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు.

ఇవి కూడా చదవండి:

Balka Suman: తెలంగాణ ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తే ఉరుకోం: బాల్క సుమన్

TG News: విజిలెన్స్, కాగ్ రిపోర్టులు అందాయి: కాళేశ్వరం కమిషన్ చీఫ్ జస్టిస్ చంద్ర ఘోష్

Jagadish Reddy: కమిషన్ల పేరుతో ప్రజల దృష్టి మరలిస్తున్నారు: మాజీమంత్రి జగదీశ్ రెడ్డి

Updated Date - Jun 12 , 2024 | 05:21 PM