రాష్ట్రస్థాయికి ఎంపికైన కిష్టాపూర్ విద్యార్థులు
ABN , Publish Date - Sep 21 , 2024 | 10:18 PM
జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో వారధి ఫౌండేషన్ హైదరాబాద్ వారు జిల్లా సైన్స్ సెంటర్లో నిర్వహించిన డిబేట్, వ్యాసరచన పోటీల్లో కిష్టాపూర్ విద్యార్థులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారని డీఈవో ఎస్.యాదయ్య తెలిపారు.
మంచిర్యాల అర్బన్, సెప్టెంబరు 21: జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో వారధి ఫౌండేషన్ హైదరాబాద్ వారు జిల్లా సైన్స్ సెంటర్లో నిర్వహించిన డిబేట్, వ్యాసరచన పోటీల్లో కిష్టాపూర్ విద్యార్థులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారని డీఈవో ఎస్.యాదయ్య తెలిపారు. పాఠశాల స్థాయిలో వృత్తి విద్య కోర్సులు ప్రవేశపెట్టడం వల్ల కల్గే లాభాలు అనే అం శంపై డిబేట్, విద్యాసంస్థల్లో కోఎడ్యుకేషన్ అంశంపై వ్యాస రచన పోటీలు నిర్వహించగా రాథోడ్ యోగేశ్వర్, గెడం కీర్తన, చేపూరి అరవిందరాణి, గెడం సందేశ్, వేల్పుల నరేందర్, ఉపారపు లిల్లీ గ్రేస్లు మొదటి స్థానంలో నిలిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారని తెలి పారు.
రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థులను డీఈవో, పాఠశాల సీనియర్ ఉపాధ్యాయులు దాముక కమలాకర్, ప్రకాష్ బానావత్, సెక్టోరియల్ అధికారులు సత్యనారాయణ మూర్తి, చౌదరి, పరీక్షల విభాగపు అధికారి దామోదర్, రాజ్కుమార్లు అభినందించారు.