Share News

ఆశ్రమ పాఠశాలను తనిఖీ చేసిన న్యాయాధికారి

ABN , Publish Date - Sep 12 , 2024 | 10:43 PM

మండల కేంద్రంలోని కస్తూర్బా ఆశ్రమ పాఠ శాలను బెల్లంపల్లి జూనియర్‌ సివిల్‌ జడ్జి ముకేష్‌ గురువారం రాత్రి తనిఖీ చేశారు. విద్యార్థుల సమస్యలు, సిలబస్‌ అంశాలను తెలుసుకున్నారు. సమస్యలను తెలిపితే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని జడ్జి పేర్కొన్నారు.

 ఆశ్రమ పాఠశాలను తనిఖీ చేసిన న్యాయాధికారి

నెన్నెల, సెప్టెంబరు 12: మండల కేంద్రంలోని కస్తూర్బా ఆశ్రమ పాఠ శాలను బెల్లంపల్లి జూనియర్‌ సివిల్‌ జడ్జి ముకేష్‌ గురువారం రాత్రి తనిఖీ చేశారు. విద్యార్థుల సమస్యలు, సిలబస్‌ అంశాలను తెలుసుకున్నారు. సమస్యలను తెలిపితే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని జడ్జి పేర్కొన్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశా రు.

నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. కనీస సౌకర్యాలు కల్పించాల్సిన ఎస్‌వో పట్టించుకోవడం లేదని గుర్తించామ న్నారు. రాత్రి పూట విద్యార్థులతోపాటు హాస్టల్‌లో ఉండాల్సిన ఎస్‌వో లేకపో వడంపై ఉన్నతాధికారులకు నివేదిస్తామన్నారు. బెల్లంపల్లి బార్‌ అసోసియే షన్‌ అధ్యక్షుడు చిప్ప మనోహర్‌, సీనియర్‌ న్యాయవాదులు ఉన్నారు.

Updated Date - Sep 12 , 2024 | 10:43 PM