Home » Bellampalli
ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహా కుంభమేళాకు గుంతకల్లు డివిజన్(Guntakal Division) మీదుగా రెండు ప్రత్యేక రైళ్లను నడుపనున్నట్టు రైల్వే అధికారులు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు.
దేవాపూర్ ఓరియంట్ సిమెం ట్ కంపెనీ గుర్తింపు సంఘం ఎన్నికలపై నెలకొన్న ఉత్కంఠకు తెరప డింది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కార్మిక శాఖ కార్యాలయంలో శుక్రవారం జరిగిన సమావేశంలో డిప్యూటీ లేబర్ కమిషనర్ ఈశ్వర మ్మ ఎన్నికల ప్రక్రియపై వివరాలను వెల్లడించారు.
బెల్లంపల్లి నియో జకవర్గం బీఆర్ఎస్ హయాంలోనే అభివృద్ధి చెందిందని మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు. తాము మం జూరు చేసిన నిధులతో పనులు చేస్తూ ఎమ్మెల్యే గడ్డం వినోద్ చేసినట్టు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకుంటున్నార న్నారు.
ఆదివాసీ గిరిజనులు మూఢ నమ్మకాలను విడనాడాలని ఉట్నూరు ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా అన్నారు. గురువారం దేవాపూర్ పంచాయతీ పెద్దాపూర్కొలాంగూడలో నిర్వహించిన వైద్య శిబిరానికి ఆమె అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రస్తు తం ఆధునిక వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయని, అయినప్పటికీ కొందరు ఆదివాసీ గిరిజనులు నాటు వైద్యాన్ని నమ్మి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారన్నారు.
ఆది వాసీ కుటుంబాల సంక్షేమమే పోలీసుల ధ్యేయ మని మంచిర్యాల డీసీపీ భాస్కర్ అన్నారు. శుక్రవారం మాదారం పోలీస్స్టేషన్ పరిధిలోని నర్సాపూర్ (బెజ్జాల) గ్రామంలో తాండూర్ సర్కిల్ పోలీసులు, రెడ్క్రాస్ సొసైటీ సహకా రంతో కమ్యూనిటీ కాంటాక్టు కార్యక్రమంలో భాగంగా పోలీసులు మీ కోసం కార్యక్రమం నిర్వహించారు.
విద్యార్థులకు నాణ్యమైన భోజ నం అందించాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని కస్తూర్బాగాంధీ పాఠశాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉపాధ్యాయులు బోధిస్తున్న తీరును పరిశీలించారు. విద్యార్థినుల విద్యా సామర్ధ్యాలను పరిశీలించి సమస్యలను తెలుసుకు న్నారు.
రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు పెద్ద పీటవేస్తోందని పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీ కృష్ణ అన్నారు. గురువారం సింగరేణి ఠాగూర్ స్టేడి యంలో అస్మిత ఖేలో ఇండియా అండర్ -13 ఉమెన్స్ పుట్బాల్ లీగ్ 2024-2025 టోర్నమెం ట్ను ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.
సీసీఐ అధికారులు, జిన్నింగు మిల్లు యజ మానులు దళారులకు కొమ్ము కాస్తున్నారని పత్తి రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం రేపల్లెవాడలోని జిన్నింగు మిల్లు యజమానులతో వాగ్వాదానికి దిగా రు. రైతులు మాట్లాడుతూ పత్తి మిల్లు వద్ద రైతుల కంటే వ్యాపారులకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
బెల్లంపల్లి పట్టణంలోని సింగరేణి రిటైర్డు కార్మికులు సింగరేణి క్వార్టర్లలో విద్యుత్ పునరుద్ధరించాలని మంగళవారం ఆందోళన చేపట్టారు. రెండు రోజుల నుంచి పట్టణంలోని వివిధ వార్డుల్లో సింగరేణి యాజమాన్యం క్వార్టర్లకు విద్యుత్ కనెక్షన్ను తొలగిస్తోంది.
గిరిజన గూడాల్లోని యువకులు ఉన్నత చదువులు చదివి ఉత్తమ పౌరులుగా ఎదగాలని బెల్లంపల్లి ఏసీపీ రవికు మార్ అన్నారు. సోమవారం దేవాపూర్ పోలీస్స్టేషన్ పరిధిలోని పాత తిర్మలాపూర్లో నిర్వహించిన పోలీ సులు మీ కోసంలో మాట్లాడారు. చదువు వల్ల సమా జంలో గౌరవం లభిస్తుందన్నారు. ప్రతీ ఒక్కరు చదువు కుని ఉన్నత ఉద్యోగాలు చేయాలని సూచించారు.