Share News

చెరువులు, కుంటలను రక్షించాలి

ABN , Publish Date - Sep 14 , 2024 | 10:56 PM

లక్షెట్టిపేట పట్టణ, మండలంలోని చెరువ ులు కుంటలను కబ్జాదా రుల నుంచి రక్షించాలని డిమాండ్‌ చేస్తూ పీడీ ఎస్‌యూ ఆధ్వర్యంలో శనివారం తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు.

చెరువులు, కుంటలను రక్షించాలి

లక్షెట్టిపేట రూరల్‌, సెప్టెంబరు 14: లక్షెట్టిపేట పట్టణ, మండలంలోని చెరువ ులు కుంటలను కబ్జాదా రుల నుంచి రక్షించాలని డిమాండ్‌ చేస్తూ పీడీ ఎస్‌యూ ఆధ్వర్యంలో శనివారం తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. సంఘం జిల్లా అధ్యక్షుడు ప్రభంజనం మాట్లాడుతూ మండలంలో చెరువులు, కుంటలు అక్రమణదారుల కోరల్లో ఉన్నాయని వాటి ని కబ్జాదారుల నుంచి కాపాడాలన్నారు. చెరువులకు, కుంటలకు, మత్తడి లెవ ల్‌కు ఎల్‌టీఎఫ్‌, బఫర్‌ జోన్లకు సరిహద్దులను ఏర్పాటు చేసి ఫెన్సింగ్‌ ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. చెరువులకు శాశ్వత బండలతో రివిట్‌ మెంట్‌ చేసి పటిష్ట నిర్మాణాలు చేపట్టాలన్నారు. ఆకాష్‌ మండల్‌, బి. అరుణ్‌, రవీందర్‌, యోగేష్‌, ప్రశాంత్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 14 , 2024 | 10:56 PM