ముంపు ప్రమాదమేమి లేదు
ABN , Publish Date - Sep 02 , 2024 | 10:40 PM
మంచిర్యాల నియోజకవర్గానికి ముంపు సమస్య లేదని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం ఎల్లంపల్లి ప్రాజెక్టును ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్రావు, డీసీపీ భాస్కర్లతో కలిసి సందర్శంచారు. కలెక్టర్ మాట్లాడుతూ భారీ వర్షాల నేపథ్యంలో జిల్లాలో కంట్రోల్ రూంను ఏర్పాటు చేశామన్నారు.
హాజీపూర్, సెప్టెంబరు 2 : మంచిర్యాల నియోజకవర్గానికి ముంపు సమస్య లేదని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం ఎల్లంపల్లి ప్రాజెక్టును ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్రావు, డీసీపీ భాస్కర్లతో కలిసి సందర్శంచారు. కలెక్టర్ మాట్లాడుతూ భారీ వర్షాల నేపథ్యంలో జిల్లాలో కంట్రోల్ రూంను ఏర్పాటు చేశామన్నారు. ఎవరైనా వరదలతో ఇబ్బందులు పడితే కంట్రోల్రూం 08736-250501కు సమాచారం అందించాలన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎగువన ఉన్న కడెం, శ్రీరాంసాగర్ నుంచి నీటిని విడుదల చేయడంతో వరద ఉధృతి పెరిగిందని, అధికార యంత్రాంగం ప్రజల రక్షణ దిశగా విశేష కృషి చేస్తుందని తెలిపారు. కలెక్టర్ నేతృత్వంలో అధికారులు ప్రజలకు అందుబాటులో ఉంటూ సహాయక చర్యలు చేపట్టడంతో పాటు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. అధికారులు చేపడుతున్న రక్షణ చర్యలకు ప్రజాప్రతినిదులు సహకరించాలని తెలిపారు. ఏసీపీ ప్రకాష్, మండల తహసీల్దార్ శ్రీనివాస్దేశ్పాండే, ఎంపీడీవో మధుసూదన్, సహాయ ఇంజనీర్లు, అధికారులు పాల్గొన్నారు.