Share News

మంచి మంచిర్యాల అక్షరాలను మాయం చేసిన వారిని శిక్షించాలి

ABN , Publish Date - Oct 22 , 2024 | 11:08 PM

జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తాలో ఏర్పాటు చేసిన మంచి మంచిర్యాల అక్షరాలను దొంగతనం చేసిన వారిని అరెస్టు చేయాలని మాజీ ఎమ్మెల్యే దివాకర్‌రావు డిమాండ్‌ చేశారు. మంగళవారం ఐబీ చౌరస్తాలో ఆయన మాట్లాడుతూ మంచిర్యాల సుందరీకరణలో భాగంగా ఐబీ చౌరస్తాలో మంచి మంచిర్యాల పెట్టాలని నిర్ణయం తీసుకుని ఏర్పాటు చేశామన్నారు.

మంచి మంచిర్యాల అక్షరాలను మాయం చేసిన వారిని శిక్షించాలి

గర్మిళ్ల, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి) : జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తాలో ఏర్పాటు చేసిన మంచి మంచిర్యాల అక్షరాలను దొంగతనం చేసిన వారిని అరెస్టు చేయాలని మాజీ ఎమ్మెల్యే దివాకర్‌రావు డిమాండ్‌ చేశారు. మంగళవారం ఐబీ చౌరస్తాలో ఆయన మాట్లాడుతూ మంచిర్యాల సుందరీకరణలో భాగంగా ఐబీ చౌరస్తాలో మంచి మంచిర్యాల పెట్టాలని నిర్ణయం తీసుకుని ఏర్పాటు చేశామన్నారు.

రాముడు ఈ ప్రాంతానికి వచ్చినట్లుగా పురాణాలు చెబుతున్నాయని, దీంతో పాత మంచిర్యాల రామాలయం, రాముని చెరువు నిర్మాణం జరిగిందన్నారు. అందుకే ఇక్కడే మంచి మంచిర్యాల పాయింట్‌ పెట్టామన్నారు. మంచి మంచిర్యాల పేరును ఎవరో మాయం చేశారని, వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని ఇందుకు మున్సిపల్‌ కమిషనర్‌, కలెక్టర్‌ బాధ్యత తీసుకుని తక్షణమే విచారణ చేపట్టాలన్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Oct 22 , 2024 | 11:08 PM