Share News

మంచినీటి సహాయకులకు శిక్షణ తరగతులు

ABN , Publish Date - Sep 26 , 2024 | 10:39 PM

మండల కేంద్రంలోని రైతు వేది కలో ఆర్‌డబ్ల్యూఎస్‌ ఆధ్వర్యంలో మంచినీటి సహాయకుల శిక్ష ణ తరగతులు కొనసాగుతున్నాయి. గురువారం జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్‌రావు మాట్లాడారు.

మంచినీటి సహాయకులకు శిక్షణ తరగతులు

జైపూర్‌, సెప్టెంబరు 26: మండల కేంద్రంలోని రైతు వేది కలో ఆర్‌డబ్ల్యూఎస్‌ ఆధ్వర్యంలో మంచినీటి సహాయకుల శిక్ష ణ తరగతులు కొనసాగుతున్నాయి. గురువారం జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్‌రావు మాట్లాడారు. శిక్షణ పూర్తి చేసుకున్న అనంతరం గ్రామపంచాయతీల్లో తాగునీటి సరఫ రాలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా జాగ్రత్తలు తీసుకో వాలని సూచించారు. మండల పంచాయతీ అధికారి బాపు రావు, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈ విద్యాసాగర్‌రావు, ట్రైనర్లు, మల్టీ పర్పస్‌ వర్కర్లు పాల్గొన్నారు. అనంతరం స్వచ్చతాహి సేవలో పాల్గొని శ్రమదానం చేస చెత్తా,చెదారం తొలగించారు.

కాసిపేట: నాలుగు రోజులుగా గ్రామ మంచినీటి సహా యకులకు ఇచ్చిన శిక్షణ తరగతులు గురువారం ముగిశాయి. నీటి వినియోగం, నాణ్యత, సరఫరా ఎలా చేయాలని, వాటర్‌ ట్యాంకుల శుభ్రత అంశాలపై శిక్షణ తరగతులు నిర్వహిం చారు. ఆర్‌డబ్య్లూఎస్‌ ఎస్‌ఈ రవీందర్‌ మాట్లాడుతూ ఎలాం టి అంతరాయం లేకుండా ప్రజలకు నీటి సరఫరా చేయాల న్నారు. ఎంపీడీవో సత్యనారాయణసింగ్‌, డిప్యూటీ ఈఈ ప్రవీణ్‌కుమార్‌, ఎంపీవోసప్దర్‌ఆలీ, ఆర్‌డబ్య్లూఎస్‌ ఏఈ సాయిఅచ్యుత్‌, శిక్షకులు పాల్గొన్నారు.

Updated Date - Sep 26 , 2024 | 10:39 PM