గల్ఫ్ కార్మికుల విజయోత్సవ ర్యాలీ
ABN , Publish Date - Sep 20 , 2024 | 10:18 PM
గల్ఫ్ కార్మికుల సంక్షే మానికి రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేయడాన్ని హర్షిస్తూ శుక్రవారం మండల కేంద్రంలో గల్ఫ్ కార్మి కుల సంక్షేమ సమితి నాయకులు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. సీఎం రేవంత్రెడ్డి, ఖానాపూర్ ఎమ్మె ల్యే వెడ్మ బొజ్జుపటేల్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశా రు.
జన్నారం, సెప్టెంబరు 20: గల్ఫ్ కార్మికుల సంక్షే మానికి రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేయడాన్ని హర్షిస్తూ శుక్రవారం మండల కేంద్రంలో గల్ఫ్ కార్మి కుల సంక్షేమ సమితి నాయకులు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. సీఎం రేవంత్రెడ్డి, ఖానాపూర్ ఎమ్మె ల్యే వెడ్మ బొజ్జుపటేల్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశా రు. నాయకులు మాట్లాడుతూ గల్ఫ్ మృతుల కు టుంబాలకు రూ.5 లక్షల ఎక్స్గ్రేషియా 2023 డిసెం బరు 7 తర్వాత మృతిచెందిన గల్ఫ్ కార్మికులకు వర్తిం పు, గల్ఫ్ కార్మికుల సంక్షేమంపై అధ్యయనం కోసం అడ్వైజరీ కమిటీ ఏర్పాటు, ప్రవాసీ ప్రజావాణి, గల్ఫ్ కార్మికుల పిల్లలకు గురుకులాల్లో ప్రాధాన్యం ఇస్తూ జీవో జారీ చేయడం సంతోషంగా ఉందన్నారు. గతం లో ఏ ప్రభుత్వాలు గల్ఫ్ కార్మికులను పట్టించుకోలే దని, కాంగ్రెస్ ప్రభుత్వం గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి కృషి చేసిందన్నారు. గౌరవాద్యక్షుడు గోపాల్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తిరుపతి, కన్వీనర్ సుదర్శన్, ప్రధాన కార్యదర్శి మల్లికార్జున్, తిరుపతి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ముజాఫర్ ఆలీ, మాణి క్యం, షాకీర్, సభ్యులు పాల్గొన్నారు.