Share News

డంపింగ్‌ యార్డు సమస్యను పరిష్కరిస్తాం

ABN , Publish Date - Sep 10 , 2024 | 10:55 PM

డంపింగ్‌యార్డు సమస్యను త్వర లోనే పరిష్కరిస్తామని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జక్కుల శ్వేత అన్నారు. మం గళవారం ఆర్డీవో హరికృష్ణతో కలిసి పెద్దనపల్లిలోని డంపింగ్‌యార్డు కోసం స్థలాన్ని పరిశీలించారు. వారు మాట్లాడుతూ కొన్ని నెలలుగా పట్టణంలో డంపింగ్‌ యార్డు లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నార న్నారు.

డంపింగ్‌ యార్డు సమస్యను పరిష్కరిస్తాం

బెల్లంపల్లిరూరల్‌, సెప్టెంబరు 10: డంపింగ్‌యార్డు సమస్యను త్వర లోనే పరిష్కరిస్తామని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జక్కుల శ్వేత అన్నారు. మం గళవారం ఆర్డీవో హరికృష్ణతో కలిసి పెద్దనపల్లిలోని డంపింగ్‌యార్డు కోసం స్థలాన్ని పరిశీలించారు. వారు మాట్లాడుతూ కొన్ని నెలలుగా పట్టణంలో డంపింగ్‌ యార్డు లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నార న్నారు. త్వరలోనే డంపింగ్‌యార్డు సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు స్థలాన్ని పరిశీలించినట్లు తెలిపారు. ఏసీపీ రవికుమార్‌, మున్సిపల్‌ కమీషనర్‌ శ్రీనివాసరావు,కౌన్సిలర్లు రాములు నాయక్‌ అస్మాషేక్‌ తదితరులు పాల్గొన్నారు.

నేటి నుంచి పారిశుధ్యంపై స్పెషల్‌ డ్రైవ్‌

బెల్లంపల్లి మండలంలో బుధవారం నుంచి పారిశుధ్యంపై స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించనున్నట్లు ఎంపీడీవో మహేందర్‌ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. భారీ వర్షాలకు గ్రామాల్లో పారిశుధ్యం లోపించకుండా స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించనన్నట్లు తెలిపారు. ఈ నెల 30వ తేదీ వరకు గ్రామాల్లో పారిశుధ్య పనులు కొనసాగుతాయని తెలిపారు.

Updated Date - Sep 10 , 2024 | 10:55 PM