BJP: బీజేపీ శాసనసభ పక్షనేతగా ఏలేటి మహేశ్వరరెడ్డి?

ABN , First Publish Date - 2024-02-08T16:46:42+05:30 IST

తెలంగాణ బీజేపీ శాసనసభ పక్షనేతగా ఏలేటి మహేశ్వర రెడ్డిని నియమించే అవకాశం ఉంది. ఈ మేరకు బీజేపీ అగ్రనాయకత్వం నేడు అధికారికంగా ప్రకటించనుందని సమాచారం. ప్రస్తుతం నిర్మల్ ఎమ్మెల్యేగా ఉన్న ఏలేటి మహేశ్వర రెడ్డి.. 2009లో ప్రజారాజ్యం పార్టీలో ఎమ్మెల్యేగా పనిచేశారు.

BJP: బీజేపీ శాసనసభ పక్షనేతగా ఏలేటి మహేశ్వరరెడ్డి?

హైదరాబాద్: తెలంగాణ బీజేపీ శాసనసభ పక్షనేతగా ఏలేటి మహేశ్వర రెడ్డిని నియమించే అవకాశం ఉంది. ఈ మేరకు బీజేపీ అగ్రనాయకత్వం నేడు అధికారికంగా ప్రకటించనుందని సమాచారం. ప్రస్తుతం నిర్మల్ ఎమ్మెల్యేగా ఉన్న ఏలేటి మహేశ్వర రెడ్డి.. 2009లో ప్రజారాజ్యం పార్టీలో ఎమ్మెల్యేగా పనిచేశారు. కాగా అసెంబ్లీ బీఏసీ సమావేశానికి 8 మంది బీజేపీ ఎమ్మెల్యేల్లో ఒకరిని పిలవాలని ఆ పార్టీ శాసనసభ్యులుస్పీకర్‌ను కోరారు. ఈ క్రమంలో నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వరరెడ్డిని పిలవాలని బీజేపీ ఎమ్మెల్యేలంతా సంతకాలు చేసిన లేఖను స్పీకర్‌కు అందించారు. దీంతో బీజేపీ నుంచి ఏలేటి మహేశ్వరరెడ్డి బీఏసీ సమావేశానికి హాజరయ్యారు. దీనిని బట్టి బీజేపీ శాసనసభా పక్షనేతగా ఏలేటి మహేశ్వరరెడ్డి పేరు ఖరారు అయినట్టేనని పలువురు చెబుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - 2024-02-08T16:46:43+05:30 IST