Share News

Raksha Bandhan: మహిళలకు రాఖీ శుభాకాంక్షలు: సీఎం

ABN , Publish Date - Aug 19 , 2024 | 04:05 AM

రాష్ట్రంలోని మహిళలందరికీ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

Raksha Bandhan: మహిళలకు రాఖీ శుభాకాంక్షలు: సీఎం

హైదరాబాద్‌, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని మహిళలందరికీ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక అయిన రాఖీ పండుగను అందరూ ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. మహిళా సాధికారతతో పాటు మహిళలను కోటిశ్వరులను చేసే సంకల్పంతో ప్రజా ప్రభు త్వం వినూత్న కార్యక్రమాలు అమలు చేస్తోందని గుర్తుచేశారు.


మహిళలకు మహాలక్ష్మి, గృహాజ్యోతి వంటి సంక్షేమ పథకాలతో పాటు స్వయం సహాయక సంఘాలకు చేయూతనిస్తుందని, వారి భద్రత విషయంలో సైతం తగిన చర్య లు చేపడుతోందని పేర్కొన్నారు. అక్కా, చెల్లెళ్లందరికీ తమ ప్రభుత్వం ఎల్లవేళలా అందుబాటులో ఉంటుందన్నారు.

Updated Date - Aug 19 , 2024 | 04:05 AM