Share News

Hyderabad: గచ్చిబౌలి అత్యాచారం కేసు.. ఆటోడ్రైవర్‌ అరెస్టు

ABN , Publish Date - Oct 17 , 2024 | 03:55 AM

హైదరాబాద్‌లోని గచ్చిబౌలి పోలీసు స్టేషన్‌ పరిధిలో మహిళపై అత్యాచారం జరిపిన ఆటోడ్రైవర్‌ను పోలీసులు అరెస్టు చేశారు.

Hyderabad: గచ్చిబౌలి అత్యాచారం కేసు.. ఆటోడ్రైవర్‌ అరెస్టు

రాయదుర్గం, అక్టోబరు16(ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లోని గచ్చిబౌలి పోలీసు స్టేషన్‌ పరిధిలో మహిళపై అత్యాచారం జరిపిన ఆటోడ్రైవర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. జంగం ప్రవీణ్‌ అనే ఆటో డ్రైవర్‌ను బుధవారం అదుపులోకి తీసుకుని న్యాయస్థానంలో హాజరుపరిచారు. గచ్చిబౌలి పోలీసుల కథనం ప్రకారం.. మంగళవారం తెల్లవారుజామున రెండున్నర గంటల సమయంలో బాధిత మహిళ గచ్చిబౌలి వెళ్లేందుకు ఆర్సీపురం సర్కిల్‌ వద్ద నిందితుడి ఆటో ఎక్కారు.


అయితే, మార్గమధ్యలో మసీద్‌బండ సిగ్నల్స్‌ వద్దకు రాగానే ఆటోను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లిన ఆటో డ్రైవర్‌.. బాధితురాలిని కొట్టి అత్యాచారం చేసి పారిపోయాడు. అటుగా వెళుతున్న ఓ ర్యాపిడో డ్రైవర్‌ సాయంతో బాధితురాలు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ కెమెరా ఫుటేజీలు, సెల్‌ఫోన్‌ నెంబర్‌ ఆధారంగా నిందితుడు జంగం ప్రవీణ్‌ను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. పోలీసు విచారణలో ప్రవీణ్‌ నేరాన్ని అంగీకరించాడు.

Updated Date - Oct 17 , 2024 | 03:55 AM