Share News

NTR Janathi: ఎన్టీఆర్ స్పూర్తితో ముందుకు వెళతాం: పురందేశ్వరి

ABN , Publish Date - May 28 , 2024 | 09:51 AM

హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా మంగళవారం ఉదయం ఆయన కుమార్తె దగ్గుబాటి పురందేశ్వరి ఎన్టీఆర్ ఘట్ వద్ద ఘనంగా నివాళులర్పించారు.

NTR Janathi: ఎన్టీఆర్ స్పూర్తితో ముందుకు వెళతాం: పురందేశ్వరి
NTR Birth Anniversary

హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జయంతి (NTR Jayanti) సందర్భంగా మంగళవారం ఉదయం ఆయన కుమార్తె దగ్గుబాటి పురందేశ్వరి (Daggubati Purandeswari) ఎన్టీఆర్ ఘట్(NTR Ghat) వద్ద ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. రాజకీయాలకు సరికొత్త నిర్వచనం చెప్పిన నేత ఎన్టీఆర్ అని, ఎన్టీఆర్ తోనే తెలుగువారి సత్తా ప్రపంచానికి తెలిసిందని అన్నారు. సంక్షేమానికి నాంది పలికిన నాయకుడని, ఎన్టీఆర్ అంటే సినీ, రాజకీయ రంగంలో ప్రభంజనమని కొనియాడారు. ఆయన స్పూర్తితో ముందుకు వెళతామని దగ్గుబాటి పురందేశ్వరి స్పష్టం చేశారు.


కాగా ఎన్టీ రామారావు జయంతిని మంగళవారం తెలుగు తమ్ముళ్లు ఘనంగా నిర్వహిస్తున్నారు. సాధారణంగా ఏటా ఈ సమయంలో టీడీపీ మహానాడు పెద్దఎత్తున జరుగుతుంది. ముఖ్యనేతలంతా మహా నాడులో పాల్గొంటే గ్రామ, మండల స్థాయి నాయ కులు, ఎన్టీఆర్‌ అభిమానులు స్థానికంగా ఎక్కడికక్కడ కార్యక్రమాలను నిర్వహిస్తారు. అయితే ఈ ఏడాది సాధారణ ఎన్నికల నేపథ్యంలో కోడ్‌ అమలులో ఉంది. దీంతో పార్టీ అధిష్ఠానం మహానాడును వాయిదా వేసి జిల్లాస్థాయి నుంచి గ్రామస్థాయి వరకూ ఎక్కడికక్కడ కార్యక్రమాల నిర్వహణకు పిలుపునిచ్చింది. అయితే అలా కూడా సాఫీగా నిర్వహించేందుకు కోడ్‌ అడ్డంకిగా మారింది. ఎన్నికల కోడ్‌ అమలు నేపథ్యంలో అన్నిరకాల రాజకీయ నాయకుల విగ్రహాలకు యంత్రాంగం ముసుగులు వేయడంతోపాటు ఆయా ప్రాంతాల్లో సభలు, సమావేశాల నిర్వహణను రద్దు చేశారు. పోలింగ్‌ ముగిసినా ఇంకా లెక్కింపు పూర్తికాక కోడ్‌ అమలులోనే ఉంది. దీంతో ఎన్టీఆర్‌ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించడం, అక్కడ సభలు, సమావేశాలు ఇతర కార్యక్రమాల నిర్వహణకు అడ్డంకిగా మారింది. ఈ నేపథ్యంలో మండల, జిల్లా పార్టీ కార్యాలయాలలో ఎన్టీఆర్‌ జయంతి కార్యక్రమాలను నిర్వహించాలని టీడీపీ అధిష్ఠానం సూచించింది. ఆ ప్రకారం కార్యాలయాలు ఉన్న చోట వాటిల్లోనూ, లేనిచోట పార్టీ నాయకులకు చెందిన ప్రైవేటు స్థలాల్లోనూ ఎన్టీఆర్‌ చిత్రపటాలు ఏర్పాటు చేసి నివాళులర్పించడంతోపాటు ఇతర కార్యక్రమాల నిర్వహణకు తెలుగు తమ్ముళ్లు సిద్ధమయ్యారు.


ఈ వార్తలు కూడా చదవండి..

జగన్ సర్కార్ ఇందుకు మినహాయింపు..

చంద్రగిరిలో వైసీపీ గెలుపుపై అనుమానాలు..

సర్వేలు కూటమికి అనుకూలంగా ఉండడంతో..

ఎన్టీఆర్‌కు నివాళులర్పించిన జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - May 28 , 2024 | 10:29 AM