Share News

DSC 2024: టీచర్ పోస్టింగులు వాయిదా

ABN , Publish Date - Oct 15 , 2024 | 10:21 AM

డీఎస్సీ 2024 అభ్యర్థుల పోస్టింగ్ వాయిదా పడింది. ఈ రోజు పోస్టింగ్ ఇస్తామని ముందుగా విద్యాశాఖ అధికారులు ప్రకటించారు. చివరి క్షణంలో పోస్టింగ్ పోస్ట్ పోన్ అని సమాచారం ఇచ్చారు.

DSC 2024: టీచర్ పోస్టింగులు వాయిదా
DSC 2024 Candidates Posting Postpone

హైదరాబాద్: ఉపాధ్యాయులకు పోస్టింగ్ ఉత్తర్వులు వాయిదా పడింది. డీఎస్సీ 2024 ద్వారా ఉపాధ్యాయ నియామకాలు అందుకున్న పదివేల ఆరు మంది కొత్త టీచర్లకు ఈ రోజు పోస్టింగ్ ఇవ్వనున్నామని విద్యాశాఖ అధికారులు ప్రకటించారు. దాంతో ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులంతా డీఈఓ కార్యాలయాలకు చేరుకున్నారు. అక్కడికి వచ్చిన అభ్యర్థులకు కౌన్సెలింగ్ వాయిదా పడిందని చావు కబురు చల్లగా చెప్పారు. దీంతో అభ్యర్థులు నిరాశతో వెనుతిరిగారు.


DSC_7211F.jpg


ఫోన్ల ద్వారా సమాచారం..

సూచించిన కార్యాలయాల్లో జరిగే కౌన్సెలింగ్‌కు హాజరుకావాలని సోమవారం ఫోన్ల ద్వారా సమాచారం ఇచ్చారు. చెప్పినట్టుగా మంగళవారం ఉదయం 9 గంటలకు కార్యాలయాలకు వచ్చారు. అక్కడ వారికి చుక్కెదురైంది. కౌన్సిలింగ్ వాయిదా పడిందని ప్రకటంిచారు. తిరిగి కౌన్సెలింగ్ నిర్వహించే తేదీని త్వరలో ప్రకటిస్తామని పేర్కొన్నారు. కౌన్సెలింగ్ కోసం ఉదయం 6 గంటలకు టెంట్లు వేశారు. వాటిని 9 గంటలకు తీసివేశారు.


సీఎం రేవంత్ రెడ్డి చేతులమీదుగా

ఇటీవల అభ్యర్థులు సీఎం రేవంత్ చేతుల మీదుగా నియామక పత్రాలు అందుకున్నారు. ఈ రోజు పోస్టింగ్ ఇవ్వాల్సి ఉంది. పోస్టింగ్ కౌన్సెలింగ్ సాంకేతిక కారణాలతో వాయిదా పడినట్టు తెలుస్తోంది.

ఇది కూడా చదవండి:

కలిసొచ్చే కాలానికి.. అందొచ్చిన కొడుకులు!


మరిన్ని తెలంగాణ వార్తల కోసం

Updated Date - Oct 15 , 2024 | 10:34 AM