Share News

TS Assembly: ఇంకా అధికారంలో ఉన్నట్లే బీఆర్ఎస్ నేతల ఫీలింగ్..: మంత్రి పొన్నం

ABN , Publish Date - Feb 09 , 2024 | 02:01 PM

బీఆర్ఎస్ నాయకులు ఇంకా అధికారంలో ఉన్నామని, మేము ఏం చెబితే అది వినాలనే ఫీలింగ్‌‌లో ఉన్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్ అయ్యారు. శుక్రవారం అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే చర్చలో భాగంగా మంత్రి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఇప్పటి వరకు 15 కోట్ల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేశారన్నారు.

TS Assembly: ఇంకా అధికారంలో ఉన్నట్లే బీఆర్ఎస్ నేతల ఫీలింగ్..: మంత్రి పొన్నం

హైదరాబాద్: బీఆర్ఎస్ నాయకులు ఇంకా అధికారంలో ఉన్నామని, మేము ఏం చెబితే అది వినాలనే ఫీలింగ్‌‌లో ఉన్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్ అయ్యారు. శుక్రవారం అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే చర్చలో భాగంగా మంత్రి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఇప్పటి వరకు 15 కోట్ల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేశారన్నారు. రూ. 535 కోట్ల విలువ గల బస్ ఫెయిర్స్‌ని ప్రభుత్వం చెల్లించిందన్నారు. ఆటో డ్రైవర్లకు నెలకు కూ. 15వేలు ఇవ్వాలని హరీష్ రావు అంటున్నారని, మరి బీఆర్ఎస్ హయంలో ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. ఆటో పన్ను రద్దు చేస్తున్నామని చలాన్ల పేరుతో వేల రూపాయలు వసులు చేశారని ఆరోపించారు.సభని తప్పుదోవ పట్టించే విధంగా 21 మంది ఆత్మహత్య చేసుకున్నారని అంటున్నారని, అటో డ్రైవర్లను బీఆర్ఎస్ నేతలే ఆత్మహత్యలకు ప్రేరేపిస్తున్నారని మంత్రి పొన్నం మండిపడ్డారు.

బస్సులు ప్రయాణికుల దగ్గరకు వెళ్లడం లేదని, ప్రయాణికులే బస్సుల దగ్గరకు ఆటోల ద్వారా వస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. అక్కా, చెల్లెలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తే ఎందుకు అంత ఈర్ష్య పడుతున్నారన్నారు. వాళ్ళకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించవద్దా? మీరు వ్యతిరేకిస్తున్నారా? అని నిలదీశారు. గతంలో మీరు ఎపుడైనా ఆటోల్లో ప్రయాణం చేసారా?.. మరి ఈ రోజు పెద్ద పెద్ద దొరలు ఆటోల్లో వస్తున్నారని ఎద్దేవా చేశారు. అహంకార ఫ్యూడల్‌గా ఆటోల్లో ప్రయాణం చేస్తున్నారని, ఆటో కార్మికులు జీవానోపాధి కోసం నడుపుకుంటే ఈ ఫ్యూడల్స్ ఆటోల్లో వచ్చి ఆటో కార్మికులను అవమానపరుస్తున్నారని అన్నారు. ఆర్టీసీని ప్రక్షాళన చేస్తున్నామని, ఆర్టీసీ కార్మికుల సంక్షేమమే తమ ధ్యేయమని, ఆటో కార్మికులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

బీఆర్ఎస్ పదేళ్లు అధికారంలో ఉండి ఆర్టీసీని నిర్వీర్యం చేసిందని, ఆటో వాళ్ళకు ఎన్నికల్లో హామీ ఇచ్చామని, న్యాయం చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ఒక బీసీ బిడ్డగా చెబుతున్నా.. మైనారిటీ, ఎస్సీ, ఎస్టీ బిడ్డలను అవమాన పరుస్తున్నారని బీఆర్ఎస్ నేతలపై మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు.

Updated Date - Feb 09 , 2024 | 02:03 PM